India’s GDP: 2025-26లో భారత జీడీపీ వృద్ధి 7.4 శాతం..
- ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి 7.4 శాతం..
- 2024-25తో పోలిస్తే పెరిగిన జీడీపీ అంచనాలు..
- కేంద్రం విడుదల చేసిన తాజా గణాంకాల్లో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s GDP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26)లో భారత జీడీపీ 7.4 శాతం వృద్ధి చెందుతుందని, ఇది 2024-25లో 6.5 శాతంగా ఉన్న వృద్ధి కంటే ఎక్కువ అని కేంద్రం బుధవారం ముందస్తు అంచనాల్లో తెలిపింది. కేంద్రం విడుదల చేసిన ఈ గణాంకాలు ఇంట్రెస్టింగ్గా మారాయి. రష్యా నుంచి భారత్ చమురు కొంటున్న కారణంగా, యూఎస్ భారత్పై 50 శాతం సుంకాలను విధించింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారత జీడీపీ మెరుగైన వృద్ధిని సాధించింది.
Read Also: Trump: ప్రధాని మోడీ నన్ను ‘‘సార్’’ అన్నారు.. ట్రంప్ తాజా కామెంట్స్..
Also Read
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
- Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇప్లిమెంట్ మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంచనా వేయబడిన 7.3 శాతం రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ (GVA) వృద్ధి రేటులో సేవల రంగంలో మంచి వృద్ధి, జీడీపీ వృద్ధికి ప్రధాన కారణంగా ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉత్పత్తి, నిర్మాణ రంగాలు ఏడు శాతం వృద్ధి చెందుతాయని అంచనా వేయగా, వ్యవసాయం, విద్యుత్, నీటి సరఫరా వంటి యుటిలిటీ సేవల వృద్ధి మితంగా ఉంటాయని భావిస్తున్నారు.
ప్రస్తుత ధరల వద్ద ఉండే నామమాత్రపు జీడీపీ, ఈ ఏడాది 8 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసినట్లు మంత్రిత్వ శాఖ చెప్పింది. స్థిర ధరల వద్ద వాస్తవ జీడీపీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక అంచానాలు రూ. 187.97 లక్షల కోట్లతో పోలిస్తే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 201.9 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుందని, దీంతో 7.4% వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేయబడింది. ప్రస్తుత ధరల వద్ద నామమాత్రపు జీడీపీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 330.68 లక్షల కోట్లతో పోలిస్తే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 357.14 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా వేయబడింది, ఇది 8% వృద్ధి రేటును చూపుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజావార్తలు
-
Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
-
Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
-
Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
-
Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుండి మరో నోటిఫికేషన్
-
AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!