Vande Bharat Trains: ఒకే రోజు 5 వందే భారత్ ట్రైన్స్ ప్రారంభం.. ఏయే రూట్లలో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Trains: భారత రైల్వేలు ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోడీ వరసగా ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే పలు మార్గాల్లో ఈ వందే భారత్ సెమీ హై స్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో 5 వందే భారత్ రైళ్లను ప్రధాని మోడీ జూన్ 26న ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని వీటిని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
Read Also: No lungi or nighty: లుంగీ కట్టుకోవద్దు, నైటీ ధరించొద్దు.. ఓ అపార్ట్మెంట్ వింత రూల్స్..
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
ముంబై-గోవా, బెంగళూరు-హుబ్లీ, పాట్నా-రాంచీ, భోపాల్-ఇండోర్ మరియు భోపాల్-జబల్పూర్ రూట్లలో వీటిని ప్రారంభించనున్నారు. ముంబై-గోవా వందే భారత్ ట్రైన్ ని ఇది వరకే ప్రారంభించాల్సి ఉన్నా.. ఒడిశా బాలాసోర్ రైలు దుర్ఘటన కారణంగా వాయిదా వేశారు. ఐదు వందే భారత్ రైళ్లను ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు పలు రూట్లలో 17 వందే భారత్ ఎక్స్ ప్రెసులు నడుస్తున్నాయి. వీటికి తోడుగా మే 26 నుంచి మరో ఐదు రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ నెలలో అన్ని రాష్ట్రాలకు వందేభారత్ రైలు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
భారతీయ రైల్వేలో ఆధునాతనమైన రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు పలు మార్గాల్లో రైళ్ల వేగాన్ని పెంచేందుకు, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిచాలనే ఉద్దేశంతో వందే భారత్ రైల్ ప్రాజెక్టును ప్రారంభించారు. పూర్తిగా దేశీయంగా ఈ రైళ్లను తయారు చేస్తున్నారు. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సామర్థ్యం ఉంది. అయితే ప్రస్తుతం భారత్ లో ఉన్న రైల్వే మార్గాలు అంత స్పీడ్ కు అనుకూలంగా లేకపోవడంతో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకే అనుమతి ఉంది. రానున్న కాలంలో మరింత వేగంగా వెళ్లేందుకు రైల్వే ట్రాకులను అప్ గ్రేడ్ చేయాలని రైల్వే భావిస్తుంది.
తాజావార్తలు
-
Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
-
Lopamudra Raut Theft Case: బిగ్బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
-
AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!