Indian Railways: గుడ్న్యూస్ చెప్పిన రైల్వేశాఖ.. ఇలా చేస్తే 20 శాతం డిస్కాంట్..!
- పండుగ సీజన్లో రైల్వే ప్రయాణికులకు శుభవార్త..
- తిరుగు ప్రయాణ టిక్కెట్లపై 20 శాతం తగ్గింపు..
- భారతీయ రైల్వేశాఖ ప్రకటన..
Indian Railways: పండుగ సీజన్లో రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది భారతీయ రైల్వేశాఖ.. పండుగ సమయంలో తిరుగు ప్రయాణ టిక్కెట్లపై 20 శాతం తగ్గింపును ప్రకటించింది.. అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 26 వరకు ఉన్న అడ్వాన్స్డ్ రిజర్వేషన్లలో తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకుంటే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.. అక్టోబర్ 13-26 మధ్య.. నవంబర్ 17 నుండి డిసెంబర్ 1 వరకు అదే రైలు నుండి తిరిగి వచ్చే ప్రయాణాలకు బుక్ చేసుకున్న టిక్కెట్లపై 20 శాతం తగ్గింపును అందించే పథకాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ఈ రోజు ప్రకటించింది.
Read Also: Mahavatar Narsimha: 150 కోట్లు కొల్లగొట్టిన యానిమేషన్ నరసింహుడు
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
ఆగస్టు 14 నుండి బుక్ చేసుకున్న టిక్కెట్లపై ఈ డిస్కౌంట్ ఉంటుంది.. కానీ, రాజధాని, శతాబ్ది, దురంతో మొదలైన ఫ్లెక్సీ ఫేర్ రైళ్లలో రిబేట్ వర్తించదు. ARP (ముందస్తు రిజర్వేషన్ వ్యవధి) తేదీ 13 అక్టోబర్ 2025 కోసం బుకింగ్ ప్రారంభ తేదీ 14.08.2025 అవుతుంది’ అని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 13 అక్టోబర్ 2025 మరియు 26 అక్టోబర్ 2025 మధ్య రైలు ప్రారంభ తేదీకి ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి.. ఆ తర్వాత నవంబర్ 17 మరియు డిసెంబర్ 1, 2025 మధ్య రైలు ప్రారంభ తేదీకి కనెక్టింగ్ జర్నీ ఫీచర్ ఉపయోగించి తిరుగు ప్రయాణ టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.. కానీ, అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 26 వరకు ఉన్న ముందస్తు రిజర్వేషన్ వ్యవధి (ARP), తిరుగు ప్రయాణాన్ని బుక్ చేసుకోవడానికి వర్తించదని స్పష్టం చేసింది.
Read Also: Peddi : ’పెద్ది’ కోసం కీలక వ్యక్తిని తీసుకొచ్చిన రామ్ చరణ్
ఈ పథకం కింద, ఒకే సెట్ ప్రయాణికులకు తదుపరి మరియు తిరుగు ప్రయాణాలకు బుక్ చేసుకున్నప్పుడు రాయితీలు వర్తిస్తాయి. తిరుగు ప్రయాణానికి సంబంధించిన ప్రయాణీకుల వివరాలు తదుపరి ప్రయాణానికి సంబంధించినవిగానే ఉంటాయి’ అని పేర్కొంది రైల్వేశాఖ.. పైన పేర్కొన్న బుకింగ్ రెండు దిశలలో ధృవీకరించబడిన టిక్కెట్లకు మాత్రమే అనుమతించబడుతుంది. తిరుగు ప్రయాణానికి సంబంధించిన బేస్ ఛార్జీపై మాత్రమే మొత్తం 20 శాతం రాయితీలు మంజూరు చేయబడతాయి అని రైల్వే మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.. ఈ స్కీమ్ కింద బుకింగ్ ఒకే క్లాస్తో పాటు ఒకే గమ్యస్థానం ఉండాలని పేర్కొంది రైల్వేశాఖ..
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!