Pannun Case: ఖలిస్తానీ పన్నూ హత్యాయత్నం కేసు.. మాజీ “రా” అధికారిపై చర్యలకు సిఫారసు
- ఖలిస్తానీ టెర్రరిస్ట్ పన్నూ హత్యాయత్నం కేసులో కీలక పరిణామం..
- మాజీ రా అధికారిపై చర్యలకు సిఫారసు చేసిన విచారణ కమిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pannun Case: ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ హత్యాయత్నం కేసులు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం భారత్-అమెరికా సంబంధాల్లో ఒడిదొడుకులకు కారణమైంది. కిరాయి ముఠాలతో పన్నూను హతమార్చేందుకు మాజీ భారతీయ నిఘా అధికారిగా గుర్తించబడిన ‘CC-1’పై అమెరికాలో అభియోగాలు దాఖలయ్యాయి. అయితే, ఈ కేసులో కీలక పరిణామం సంభవించింది. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది.
అమెరికా-కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన పన్నూని చంపడానికి సదరు వ్యక్తి కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చిన తర్వాత, డ్రగ్స్ మాఫియా, క్రిమినల్ ముటాలతో ఆ వ్యక్తి ఉన్న సంబంధాలను పరిశోధించడానికి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అతడి మునుపటి నేర సంబంధాలు కూడా విచారణ సమయంలో వెలుగులోకి వచ్చినట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన తెలిపింది.
Also Read
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
‘CC-1’ అని పిలువబడే వ్యక్తిని తరువాత యూఎస్ ఏజెన్సీ FBI వికాష్ యాదవ్ గా గుర్తించింది. ఇతను భారత గూఢచార సంస్థ ‘‘రీసెర్చ్ అండ్ అనాలిసిస్(R&AW)’’ మాజీ అధికారి. విచారణ కమిటీ సొంత దర్యాప్తుతో పాటు అమెరికా వైపు నుంచి వచ్చిన ఆధారాలను కూడా పరిశీలించింది. ఈ కేసులో రెండు దేశాల అధికారులు పరస్పరం సహకరించుకున్నారు.
Read Also: Shridhar Babu: కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయాభివృద్ధికి సహకరించండి.. కేంద్రమంత్రికి వినతి
ఏంటీ ఈ కేసు..?
గురుపత్వంత్ సింగ్ పన్నూ ఖలిస్తానీ ఉగ్రవాది. ఇతడిని చంపేందుకు వికాశ్ యాదవ్ కిరాయి హత్యకు ప్లాన్ చేసినట్లు అభియోగాలు ఉన్నట్లు, న్యూయార్క్లోని సదరన్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీస్ తెలిపింది. ఈ హత్యాయత్నంలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ఎఫ్బీఐ ఆరోపించింది. యూఎస్ పౌరులపై ప్రతీకారం తీర్చుకోవాలనే చర్యల్ని ఎఫ్బీఐ సహించదని అప్పటి డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే అన్నారు.
ఈ హత్యని అమలు చేయడానికి 2023లో మేలో భారతీయుడైన నిఖిల్ గుప్తాని నియమించుకున్నట్లు వికాశ్ యాదవ్పై ఆరోపనలు ఉన్నాయి. యూఎస్ ఇచ్చిన సమచారంతో చెక్ రిపబ్లిక్లో నిఖిల్ గుప్తాని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇతడిని అమెరికాకు అప్పగించారు. వికాశ్ యాదవ్ ఈ హత్య కోసం ఒక వ్యక్తికి 1,00,000 డాలర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపించారు. ఈ కిరాయి హంతకుడు అండర్కవర్గా పనిచేస్తున్న ఏజెన్సీ ఇన్ఫార్మర్ అని ఎఫ్బీఐ తెలిపింది.
తాజావార్తలు
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!