Pannun Case: ఖలిస్తానీ పన్నూ హత్యాయత్నం కేసు.. మాజీ “రా” అధికారిపై చర్యలకు సిఫారసు
- ఖలిస్తానీ టెర్రరిస్ట్ పన్నూ హత్యాయత్నం కేసులో కీలక పరిణామం..
- మాజీ రా అధికారిపై చర్యలకు సిఫారసు చేసిన విచారణ కమిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pannun Case: ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ హత్యాయత్నం కేసులు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం భారత్-అమెరికా సంబంధాల్లో ఒడిదొడుకులకు కారణమైంది. కిరాయి ముఠాలతో పన్నూను హతమార్చేందుకు మాజీ భారతీయ నిఘా అధికారిగా గుర్తించబడిన ‘CC-1’పై అమెరికాలో అభియోగాలు దాఖలయ్యాయి. అయితే, ఈ కేసులో కీలక పరిణామం సంభవించింది. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది.
అమెరికా-కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన పన్నూని చంపడానికి సదరు వ్యక్తి కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చిన తర్వాత, డ్రగ్స్ మాఫియా, క్రిమినల్ ముటాలతో ఆ వ్యక్తి ఉన్న సంబంధాలను పరిశోధించడానికి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అతడి మునుపటి నేర సంబంధాలు కూడా విచారణ సమయంలో వెలుగులోకి వచ్చినట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన తెలిపింది.
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
‘CC-1’ అని పిలువబడే వ్యక్తిని తరువాత యూఎస్ ఏజెన్సీ FBI వికాష్ యాదవ్ గా గుర్తించింది. ఇతను భారత గూఢచార సంస్థ ‘‘రీసెర్చ్ అండ్ అనాలిసిస్(R&AW)’’ మాజీ అధికారి. విచారణ కమిటీ సొంత దర్యాప్తుతో పాటు అమెరికా వైపు నుంచి వచ్చిన ఆధారాలను కూడా పరిశీలించింది. ఈ కేసులో రెండు దేశాల అధికారులు పరస్పరం సహకరించుకున్నారు.
Read Also: Shridhar Babu: కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయాభివృద్ధికి సహకరించండి.. కేంద్రమంత్రికి వినతి
ఏంటీ ఈ కేసు..?
గురుపత్వంత్ సింగ్ పన్నూ ఖలిస్తానీ ఉగ్రవాది. ఇతడిని చంపేందుకు వికాశ్ యాదవ్ కిరాయి హత్యకు ప్లాన్ చేసినట్లు అభియోగాలు ఉన్నట్లు, న్యూయార్క్లోని సదరన్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీస్ తెలిపింది. ఈ హత్యాయత్నంలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ఎఫ్బీఐ ఆరోపించింది. యూఎస్ పౌరులపై ప్రతీకారం తీర్చుకోవాలనే చర్యల్ని ఎఫ్బీఐ సహించదని అప్పటి డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే అన్నారు.
ఈ హత్యని అమలు చేయడానికి 2023లో మేలో భారతీయుడైన నిఖిల్ గుప్తాని నియమించుకున్నట్లు వికాశ్ యాదవ్పై ఆరోపనలు ఉన్నాయి. యూఎస్ ఇచ్చిన సమచారంతో చెక్ రిపబ్లిక్లో నిఖిల్ గుప్తాని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇతడిని అమెరికాకు అప్పగించారు. వికాశ్ యాదవ్ ఈ హత్య కోసం ఒక వ్యక్తికి 1,00,000 డాలర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపించారు. ఈ కిరాయి హంతకుడు అండర్కవర్గా పనిచేస్తున్న ఏజెన్సీ ఇన్ఫార్మర్ అని ఎఫ్బీఐ తెలిపింది.
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!