Ram Mandir: అయోధ్య రాముడిని దర్శించుకున్న తొలి విదేశీ నేతగా ఫిజీ డిప్యూటీ పీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir: అయోధ్య రామ మందిరాన్ని ఫిజీ దేశ ఉప ప్రధాని బిమన్ ప్రసాద్ గురువారం సందర్శించారు. అయోధ్య రాముడిని దర్శించుకున్న తొలి విదేశీ నేతగా ఫిజీ ప్రధాని నిలిచారు. గత నెల 22న అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఫిజీలో భారతీయ ప్రవాసులకు ప్రాతినిధ్యం వహించిన ప్రతినిధి బృందానికి బియన్ ప్రసాద్ నాయకత్వం వహించారు.
భారత్, ఫిజీ బంధం గురించి ఆయన మీడియా ముందు హైలెట్ చేశారు. బ్రిటీష్ వలస పాలనలో ఇండియా నుంచి ప్రజలు ఫిజీకి వెళ్లారని, భగవద్గీత-రామాయణం బోధనలను తీసుకెళ్లామని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ప్రాణప్రతిష్ట వేడుకలు ఫిజీ దేశంలో కూడా అట్టహాసంగా జరిగాయని ఆయన వెల్లడించారు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
Read Also: Gyanvapi: జ్ఞానవాపిపై జైల్ భరోకి పిలుపునిచ్చిన ఇత్తేహాద్-ఎ-మిల్లత్ చీఫ్.. బరేలీలో తీవ్ర ఉద్రిక్తత..
విభిన్న మతపరమైన నేపథ్యాలు ఉన్నప్పటికీ ఫిజీలో దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు దేశం మొత్తం ప్రభుత్వ సెలవుదినం. అయోధ్యను దర్శించుకోవడం ఉప ప్రధాని ప్రసాద్ ఒక విశేషంగా భావించారు. ఈ పర్యటన ద్వారా భారత్, ఫిజీ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకున్నారు.
భారత సంతతికి చెందిన ఫిజీ ప్రజల్లో ఎక్కువ మంది ఉత్తర్ ప్రదేశ్, బీహార్ నుంచే వలస వెళ్లారు. దీంతో తమకు అయోధ్యతో ప్రత్యేక సంబంధం ఉందని ఆయన వెల్లడించారు. ఫిబ్రవరి 10 వరకు ఆయన భారత్లో పర్యటించనున్నారు. ఫిజీతో పాటు భారత సంతతి పౌరులు, హిందువులు ఎక్కువగా ఉన్న మారిషస్ కూడా అయోధ్య ప్రాణప్రతిష్ట రోజు సెలవు ప్రకటించింది.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!