NTV Telugu Site icon

Khalistan: ఖలిస్తానీ టెర్రరిస్టు హత్యకు కుట్ర.. భారత్‌కు అమెరికా కోర్టు నోటిసులు..

Us Court

Us Court

Khalistan: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తన హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ సివిల్ దావా వేసిన నేపథ్యంలో అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు ​​జారీ చేసింది. సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ సమన్లలో భారత ప్రభుత్వంతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, R&AW మాజీ చీఫ్ సమంత్ గోయెల్, RAW ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారతీయ వ్యాపారవేత్త నిఖిల్ గుప్తాల పేర్లను పొందుపర్చింది. ఈ నోటీసుల్లో పేరున్న వారందరూ 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని యూఎస్ న్యాయస్థానం కోరింది. కాగా, ఈ సమన్లపై ఇప్పటి వరకు కేంద్రం స్పందించలేదు.

Read Also: Jamili Elections: జమిలి ఎన్నికల కోసం చేయాల్సిన రాజ్యాంగ సవరణలు..

అయితే, గత ఏడాది నవంబరులో సిక్కులు ఫర్ జస్టిస్ అనే రాడికల్ సంస్థకు నాయకత్వం వహిస్తున్న యూఎస్- కెనడా ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను చంపడానికి జరిగిన కుట్రను యూఎస్ పోలీసులు భగ్నం చేశారు. ఈ కుట్రలో ఒక భారతీయ అధికారికి లింక్ ఉందని యుఎస్ కోర్టులో పన్నూన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది ప్రభుత్వ విధానానికి కూడా విరుద్ధమని అప్పటి MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. అలాగే, ఈ ఏడాది మేలో అమెరికాలో పర్యటించిన భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతుంది.. ఇది భారత్- యుఎస్ సంబంధాలపై ఏమాత్రం ప్రభావం చూపదని అన్నారు.