Khalistan: ఖలిస్తానీ టెర్రరిస్టు హత్యకు కుట్ర.. భారత్కు అమెరికా కోర్టు నోటిసులు..
- ఖలిస్తానీ టెర్రరిస్టును హత్య చేసేందుకు కుట్ర..
- భారత్కు నోటీసులు జారీ చేసిన అమెరికా కోర్టు..
- 21 రోజుల్లో సమాధానం చెప్పాలని కోరిన యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తన హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ సివిల్ దావా వేసిన నేపథ్యంలో అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది. సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ సమన్లలో భారత ప్రభుత్వంతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, R&AW మాజీ చీఫ్ సమంత్ గోయెల్, RAW ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారతీయ వ్యాపారవేత్త నిఖిల్ గుప్తాల పేర్లను పొందుపర్చింది. ఈ నోటీసుల్లో పేరున్న వారందరూ 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని యూఎస్ న్యాయస్థానం కోరింది. కాగా, ఈ సమన్లపై ఇప్పటి వరకు కేంద్రం స్పందించలేదు.
Read Also: Jamili Elections: జమిలి ఎన్నికల కోసం చేయాల్సిన రాజ్యాంగ సవరణలు..
Also Read
అయితే, గత ఏడాది నవంబరులో సిక్కులు ఫర్ జస్టిస్ అనే రాడికల్ సంస్థకు నాయకత్వం వహిస్తున్న యూఎస్- కెనడా ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ను చంపడానికి జరిగిన కుట్రను యూఎస్ పోలీసులు భగ్నం చేశారు. ఈ కుట్రలో ఒక భారతీయ అధికారికి లింక్ ఉందని యుఎస్ కోర్టులో పన్నూన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది ప్రభుత్వ విధానానికి కూడా విరుద్ధమని అప్పటి MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. అలాగే, ఈ ఏడాది మేలో అమెరికాలో పర్యటించిన భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతుంది.. ఇది భారత్- యుఎస్ సంబంధాలపై ఏమాత్రం ప్రభావం చూపదని అన్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?