India vs Pakistan: పాక్కి భారత్ మరో షాక్.. ఆ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపుకు ప్లాన్..
- పాకిస్తాన్ కు మరో షాక్ ఇచ్చిన భారత్..
- కాశ్మీర్లోని హైడ్రో పవర్ ప్రాజెక్టుల్లో నీటినిల్వ సామర్థ్యం పెంపుకు ప్లాన్..
- జమ్మూ కాశ్మీర్ లో నిర్మించే ప్రాజెక్టుల్లో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: పాకిస్తాన్ కు భారత్ మరో షాక్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్లోని హైడ్రో పవర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై మోడీ సర్కార్ ప్రణాళికలు రెడీ చేస్తోందని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. అయితే, ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాక్తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఇక, సింధు, దాని ఉప నదులపై భారత్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ల నిర్మాణం కష్టంగా మారడంతో.. పాటు నీటి నిల్వ సామర్థ్యం పెంచడం కూడా సమస్యగా ఉండేది. కానీ, ఇప్పుడు దాయాది దేశంతో ఒప్పందాన్ని నిలిపివేయడంతో.. కొత్త ప్రాజెక్టులతో పాటు నీటి నిల్వను కూడా పెంచే ఛాన్స్ దొరికింది. అయితే, నిర్మాణ ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టుల్లో ఇప్పుడు ఎటువంటి మార్పులు చేయడం లేదన్నారు. ఎందుకంటే వీటికి సంబంధించిన సాంకేతిక అంశాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. మరికొన్ని ప్రాజెక్టులు ప్రారంభ దశలోనే ఉండటంతో.. వాటిల్లో విద్యుత్త్ ఉత్పత్తిని ఎక్కువగా చేసేందుకు నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి ప్లాన్ చేస్తున్నామని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పుకొచ్చారు.
Read Also: Muhammad Yunus: షేక్ హసీనాను అప్పగించమంటే మోడీ ఏమన్నారంటే..! యూనస్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
అయితే, ప్రస్తుతం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ జమ్మూ కాశ్మీర్లో నాలుగు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, ఇవి ఇంకా నిర్మాణ పనులను స్టార్ట్ చేయాల్సి ఉంది. వీటిల్లో సింధు నదిపై న్యూ గందర్బాల్ ప్రాజెక్టు, చీనాబ్పై కిర్తాయ్-2, సవల్కోట్, జీలంపై ఉరి-1,2 ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. కాగా, 1960 సెప్టెంబరులో సింధు, దాని ఉప నదుల జలాలను పంచుకోవడానికి వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు దీనిపై సంతకాలు చేశారు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!