GPS-Based Toll: ఇక “GPS-ఆధారిత టోల్” వసూలు విధానం.. ఎలా పనిచేస్తుంది..?
GPS-Based Toll: వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఇక ఎదురుచూసే ఇబ్బందులు తప్పబోతున్నాయి. స్మూల్ డ్రైవింగ్కి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రయాణించేలా కొత్త విధానాన్ని కేంద్రం తీసుకురాబోతోంది. ప్రస్తుతం దేశంలోని హైవే టోల్ ప్లాజాల స్థానంలో GPS-ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఈ విధానం తసీుకువచ్చేందుకు కేంద్ర ప్రయత్నిస్తోంది. జాతీయ రహదారులపై జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కన్సల్టెంట్ను నియమించిందని గడ్కరీ గురువారం తెలిపారు.
ఫాస్ట్ ట్యాగ్లతో పాటు పైలెట్ ప్రాతిపదికన జీపీఎస్ టోక్ కలెక్షన్ వ్యవస్థను ప్రవేశపెడతామని మంత్రి వెల్లడించారు. ట్రాఫిక్ తగ్గించడంతో పాటు, హైవేలో ప్రయానించిన ఖచ్చితమైన దూరానికి వాహనాదారుడి నుంచి ఛార్జీలు వసూలు చేసే లక్ష్యంతో ఈ విధానాన్ని తీసుకురాబోతున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని NHAI యొక్క టోల్ ఆదాయం ప్రస్తుతం రూ. 40,000 కోట్లుగా ఉందని, 2-3 సంవత్సరాలలో ఇది రూ. 1.40 లక్షల కోట్లకు చేరుకోబోతోందని గడ్కరీ గతంలో చెప్పారు. 2018-19లో, టోల్ ప్లాజా వద్ద వాహనాల కోసం సగటు నిరీక్షణ సమయం 8 నిమిషాలు ఉంటే, 2020-21 మరియు 2021-22లో ఫాస్ట్ట్యాగ్లను ప్రవేశపెట్టడంతో, వాహనాల సగటు నిరీక్షణ సమయం 47 సెకన్లకు తగ్గించబడింది. 2021లో కేంద్రం టోల్ చెల్లించడానికి ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసింది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Russia: భారత్ని మా నుంచి దూరం చేసేందుకు పాశ్చాత్య దేశాల కుట్ర..
GPS-ఆధారిత టోల్ సిస్టమ్ ఎలా పని చేస్తుంది?
GPS ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ హైవేలపై అమర్చిన కెమెరాల ద్వారా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) వ్యవస్థను ఉపయోగించి, వాహనం ప్రయాణించే దూరం ఆధారంగా టోల్ వసూలు చేస్తుంది. ప్రస్తుతం, FASTags ప్లాజాల్లో RFID ఆధారిత టోల్ సేకరణను ఉపయోగిస్తోంది.
హైవేలపై వాహనాలు వెళ్తున్న సమయంలో వాహనాల కదలికల్ని కెమెరాలు పర్యవేక్షిస్తాయి. ఎక్కడ ఎంట్రీ అయ్యారు, ఎక్కడ ఎగ్జిట్ అయ్యారనే వివరాలను ఖచ్చితంగా నమోదు చేస్తుంది. మీ ప్రయాణ దూరాన్ని విశ్లేషించి టోల్ ఫీజును వసూలు చేస్తుంది. ఈ విధానం ద్వారా తక్కువ దూరం ప్రయాణించే వారికి న్యాయం జరుగుతుంది. ఈ విధానంతో రోడ్డుపై వాహనాలు టోల్ చెల్లింపుల కోసం ఎదురుచూడటం వంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందొచ్చు. సురక్షితమైన ఎలక్టోనిక్ పేమెంట్ సిస్టమ్ ద్వారా వాహనదారుడు లింక్ చేసిన ఖాతా నుంచి ఆటోమేటిక్గా టోల్ ఫీజును వసూలు చేసుకుంటుంది. దీని వల్ల మానవతప్పిదాలకు, టోల్ ఎగవేత అవకాశాలు తగ్గుతాయి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!