India Thae Plan: భారత్కు గుడ్ న్యూస్.. థార్ ఎడారిలో పెరిగిన చమురు వెలికితీత..
- చమురు సంక్షోభం వేళ గుడ్ న్యూస్..
- థార్ ఎడారిలో పెరిగిన చమురు ఉత్పత్తి..
- ఫలిస్తున్న భారత్ ‘‘థార్’’ ప్లాన్..
India Thae Plan: అమెరికా-ఇరాన్ యుద్ధ సమయం వల్ల చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు పెట్రోల్, డీజిల్ కోసం అల్లాడుతున్నాయి. మన దేశంపై పెద్దగా ప్రభావం లేకున్నా, దీర్ఘకాలం ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం భారత్ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే భారత్ తన ‘‘థార్’’ ప్రణాళికను అమలు చేస్తోంది. థార్ ఎడారి ప్రాంతంలో ఉన్న చమురు క్షేత్రాల నుంచి ముడి చమురు ఉత్పత్తిని పెంచింది.
రికార్డ్ స్థాయిలో 1202 బ్యారెళ్ల ముడి చమురును జోధ్ పూర్ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి ఉత్పత్తి చేస్తోంది. గతేడాది ఇక్కడి నుంచి రోజుకు 705 బ్యారెళ్ల ఉత్పత్తి మాత్రమే జరిగేది. ఈ సంక్షోభం నేపథ్యంలో గతేడాది కన్నా 70 శాతం అధిక చమురు ఉత్పత్తిని పెంచింది. ఆయిల్ ఇండియా, జైసల్మేర్లోని బఘేవాలా చమురు క్షేత్రం నుండి ముడి చమురును ట్యాంకర్ల ద్వారా గుజరాత్లోని మెహసానాలో ఉన్న ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ప్లాంట్లకు రవాణా చేస్తుంది. అక్కడి నుండి, ఆ ముడి చమురును పైప్లైన్ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న కోయాలి రిఫైనరీకి రవాణా చేస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ఆయిల్ ఇండియా తన రాజస్థాన్ ఫీల్డ్ నుంచి 43,773 మెట్రిక్ టన్నుల ముడి చమురును ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది 32,787 మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువ ఉత్పత్తి చేస్తోంది. థార్ ఎడారిలోని చమురు ఈ సమయంలో కీలకంగా మారుతోంది.
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
1991లో వెలుగులోకి చమురు:
బికనేర్-నాగౌర్ సబ్ బేసిన్లో ఉన్న బఘేవాలా చమురు క్షేత్రం భారతదేశంలోని కొన్ని చమురు క్షేత్రాల్లో ఒకటి. ఆయిల్ ఇండియా 19 బావులలో సీఎస్ఎస్(సైక్లిక్ స్టీమ్ స్టిమ్యులేషన్) కార్యకలాపాలను పూర్తి చేసింది. ఇది గతేడాదితో పోలిస్తే సుమారుగా 72 శాతం పెరుగుదల. 1991లో ఈ ప్రాంతంలో చమురును గుర్తించారు. 200.26 చదరపు కి.మీ విస్తీర్ణంలోని థార్ చమురు క్షేత్రంలో 52 బావులు ఉండగా, 33 పనిచేస్తున్నాయి. ఆయిల్ ఇండియా 2018లో తొలిసారిగా సీఎస్ఎస్ టెక్నాలజీని ప్రారంభించింది. ఈ క్షేత్రం నుంచి భారీ స్థాయిలో వెలికితీతకు వీలవుతుంది.
తాజావార్తలు
-
Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా…
-
US-Iran talks: శాంతి చర్చల్లో అనిశ్చితి.. పాక్ నుంచి వెళ్లిపోయిన ఇరాన్ బృందం..
-
KL Rahul Emotional: పాపం కేఎల్ రాహుల్.. ఆరెంజ్ క్యాప్ వచ్చినా కనపడని ఆనందం..
-
Vaibhav Sooryavanshi: బాల్ ఎలా వేసిన రిస్క్ బౌలర్లకే.. కొట్టిపడేస్తా.. బుడ్డోడు మరో సెంచరీ.. పలు రికార్డ్స్ బ్రేక్
-
Scientists disappear: సైంటిస్టులు మాయం.. అమెరికా, చైనాలో టెన్షన్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!