India Thae Plan: భారత్కు గుడ్ న్యూస్.. థార్ ఎడారిలో పెరిగిన చమురు వెలికితీత..
- చమురు సంక్షోభం వేళ గుడ్ న్యూస్..
- థార్ ఎడారిలో పెరిగిన చమురు ఉత్పత్తి..
- ఫలిస్తున్న భారత్ ‘‘థార్’’ ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Thae Plan: అమెరికా-ఇరాన్ యుద్ధ సమయం వల్ల చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు పెట్రోల్, డీజిల్ కోసం అల్లాడుతున్నాయి. మన దేశంపై పెద్దగా ప్రభావం లేకున్నా, దీర్ఘకాలం ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం భారత్ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే భారత్ తన ‘‘థార్’’ ప్రణాళికను అమలు చేస్తోంది. థార్ ఎడారి ప్రాంతంలో ఉన్న చమురు క్షేత్రాల నుంచి ముడి చమురు ఉత్పత్తిని పెంచింది.
రికార్డ్ స్థాయిలో 1202 బ్యారెళ్ల ముడి చమురును జోధ్ పూర్ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి ఉత్పత్తి చేస్తోంది. గతేడాది ఇక్కడి నుంచి రోజుకు 705 బ్యారెళ్ల ఉత్పత్తి మాత్రమే జరిగేది. ఈ సంక్షోభం నేపథ్యంలో గతేడాది కన్నా 70 శాతం అధిక చమురు ఉత్పత్తిని పెంచింది. ఆయిల్ ఇండియా, జైసల్మేర్లోని బఘేవాలా చమురు క్షేత్రం నుండి ముడి చమురును ట్యాంకర్ల ద్వారా గుజరాత్లోని మెహసానాలో ఉన్న ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ప్లాంట్లకు రవాణా చేస్తుంది. అక్కడి నుండి, ఆ ముడి చమురును పైప్లైన్ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న కోయాలి రిఫైనరీకి రవాణా చేస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ఆయిల్ ఇండియా తన రాజస్థాన్ ఫీల్డ్ నుంచి 43,773 మెట్రిక్ టన్నుల ముడి చమురును ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది 32,787 మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువ ఉత్పత్తి చేస్తోంది. థార్ ఎడారిలోని చమురు ఈ సమయంలో కీలకంగా మారుతోంది.
Also Read
- PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
1991లో వెలుగులోకి చమురు:
బికనేర్-నాగౌర్ సబ్ బేసిన్లో ఉన్న బఘేవాలా చమురు క్షేత్రం భారతదేశంలోని కొన్ని చమురు క్షేత్రాల్లో ఒకటి. ఆయిల్ ఇండియా 19 బావులలో సీఎస్ఎస్(సైక్లిక్ స్టీమ్ స్టిమ్యులేషన్) కార్యకలాపాలను పూర్తి చేసింది. ఇది గతేడాదితో పోలిస్తే సుమారుగా 72 శాతం పెరుగుదల. 1991లో ఈ ప్రాంతంలో చమురును గుర్తించారు. 200.26 చదరపు కి.మీ విస్తీర్ణంలోని థార్ చమురు క్షేత్రంలో 52 బావులు ఉండగా, 33 పనిచేస్తున్నాయి. ఆయిల్ ఇండియా 2018లో తొలిసారిగా సీఎస్ఎస్ టెక్నాలజీని ప్రారంభించింది. ఈ క్షేత్రం నుంచి భారీ స్థాయిలో వెలికితీతకు వీలవుతుంది.
తాజావార్తలు
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!