India: కెనడాలో దాడిపై భారత్ సీరియస్.. ఆ దేశ రాయబారికి సమన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Summons Canada Envoy Over Khalistan Protest: ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా ఇలా పలు దేశాల్లో భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దేశంలో ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో అశాంతి చెలరేగేలా చేసేందుకు ప్రయత్నించిన ఖలిస్తానీ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే అమృత్ పాల్ సింగ్ తన వేషాన్ని మార్చుకుని నేపాల్ మీదుగా విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఇదిలా ఉంటే అమృత్ పాల్ సింగ్ కు మద్దతుగా కొన్ని రాడికల్ ఖలిస్తానీ శక్తులు భారత హైకమిషన్ కార్యాలయాలే టార్గెట్ గా దాడులకు తెగబడుతున్నాయి. గత ఆదివారం, బుధవారం యూకే లండన్ లోని భారత రాయబార కార్యాలయంపై దాడులు చేశారు. భారత జాతీయ జెండాను అవమానపరచాలని చూశారు.
Also Read
- KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
- TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
- Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Modi-Marco Rubio: వైట్హౌస్ను సందర్శించండి.. ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం
Read Also: Swara Bhasker: “పప్పు”కు మీరెందుకు భయపడుతున్నారు.. రాహుల్ గాంధీకి స్వరాభాస్కర్ మద్దతు
ఇదిలా ఉంటే కెనడాలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడా రాయబారికి సమన్లు జారీ చేసింది. కెనడా హైకమిషనర్ ను పిలిచి నిరసన వ్యక్తం చేసింది. మా దౌత్యవేత్తలు భద్రత కోసం కెనడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం, ఇలా అయితే వారు దౌత్యవిధులను నిర్వర్తించగలరని విదేశాంగశాఖ స్పోక్స్ పర్సన్ అరిందమ్ బాగ్చీ ఓ నోట్ లో వెల్లడించారు. పోలీస్ సమక్షంలో ఇలాంటి శక్తులను ఎలా అనుమతిస్తారని కెనడాని ప్రశ్నించారు. పోలీసులు ఉన్నా భద్రతను ఎలా ఉల్లంఘిస్తారని దానికి జవాబు ఇవ్వాలని భారత ప్రభుత్వం కోరింది. వియన్నా కన్వేన్షన్ ప్రకారం ఈ దాడిలో పాల్గొన్న అందరిని అరెస్ట్ చేసి, విచారణ జరపాలని కెనడా ప్రభుత్వాన్ని కోరింది. ఖలిస్తానీ మద్దతుదారుల హింసాత్మక చర్యల మధ్య భద్రతా కారణాలతో కెనడాలో భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ పాల్గొనాల్సిన కార్యక్రమం రద్దు చేయబడింది. నిరసనను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై రాడికల్ ఖలిస్తాన్ మద్దతుదారులు దాడులకు పాల్పడ్డారు.
తాజావార్తలు
-
KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
-
TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
-
Rohit Sharma: “నన్ను క్షమించు..” మహిళా అభిమానికి ‘హిట్ మ్యాన్’ స్పెషల్ రిక్వెస్ట్..!
-
Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Film Chamber: ఆ కలరింగ్ అంతా అబద్ధం.. ‘పెద్ది’ పర్సెంటేజ్ డీల్ను తిరస్కరించిన ఎగ్జిబిటర్లు
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!