India: కెనడాలో దాడిపై భారత్ సీరియస్.. ఆ దేశ రాయబారికి సమన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Summons Canada Envoy Over Khalistan Protest: ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా ఇలా పలు దేశాల్లో భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దేశంలో ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో అశాంతి చెలరేగేలా చేసేందుకు ప్రయత్నించిన ఖలిస్తానీ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే అమృత్ పాల్ సింగ్ తన వేషాన్ని మార్చుకుని నేపాల్ మీదుగా విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఇదిలా ఉంటే అమృత్ పాల్ సింగ్ కు మద్దతుగా కొన్ని రాడికల్ ఖలిస్తానీ శక్తులు భారత హైకమిషన్ కార్యాలయాలే టార్గెట్ గా దాడులకు తెగబడుతున్నాయి. గత ఆదివారం, బుధవారం యూకే లండన్ లోని భారత రాయబార కార్యాలయంపై దాడులు చేశారు. భారత జాతీయ జెండాను అవమానపరచాలని చూశారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
Read Also: Swara Bhasker: “పప్పు”కు మీరెందుకు భయపడుతున్నారు.. రాహుల్ గాంధీకి స్వరాభాస్కర్ మద్దతు
ఇదిలా ఉంటే కెనడాలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడా రాయబారికి సమన్లు జారీ చేసింది. కెనడా హైకమిషనర్ ను పిలిచి నిరసన వ్యక్తం చేసింది. మా దౌత్యవేత్తలు భద్రత కోసం కెనడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం, ఇలా అయితే వారు దౌత్యవిధులను నిర్వర్తించగలరని విదేశాంగశాఖ స్పోక్స్ పర్సన్ అరిందమ్ బాగ్చీ ఓ నోట్ లో వెల్లడించారు. పోలీస్ సమక్షంలో ఇలాంటి శక్తులను ఎలా అనుమతిస్తారని కెనడాని ప్రశ్నించారు. పోలీసులు ఉన్నా భద్రతను ఎలా ఉల్లంఘిస్తారని దానికి జవాబు ఇవ్వాలని భారత ప్రభుత్వం కోరింది. వియన్నా కన్వేన్షన్ ప్రకారం ఈ దాడిలో పాల్గొన్న అందరిని అరెస్ట్ చేసి, విచారణ జరపాలని కెనడా ప్రభుత్వాన్ని కోరింది. ఖలిస్తానీ మద్దతుదారుల హింసాత్మక చర్యల మధ్య భద్రతా కారణాలతో కెనడాలో భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ పాల్గొనాల్సిన కార్యక్రమం రద్దు చేయబడింది. నిరసనను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై రాడికల్ ఖలిస్తాన్ మద్దతుదారులు దాడులకు పాల్పడ్డారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!