Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News India Stands Firm On Dairy Stalls Us Trade Pact Talks Before Tariff Deadline

India-US trade deal: అమెరికా ఒత్తిడికి తలొగ్గని భారత్.. వాణిజ్య ఒప్పందంలో ప్రతిష్టంభన..

Published Date :July 1, 2025 , 10:01 pm
By Venu Goapl Reddy
  • ట్రేడ్ డీల్ కోసం అమెరికా ఒత్తిడి..
  • వ్యవసాయం, పాడి పరిశ్రమ విషయంలో రాజీపడని భారత్..
  • వాణిజ్య చర్చల్లో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన..
India-US trade deal: అమెరికా ఒత్తిడికి తలొగ్గని భారత్.. వాణిజ్య ఒప్పందంలో ప్రతిష్టంభన..
  • Follow Us :
  • google news
  • dailyhunt

India-US trade deal: ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. అమెరికాకు చెందిన నేతలు మాట్లాడుతూ.. భారత్‌తో వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుందని చెబుతున్నారు. కానీ, పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా, కొన్ని రంగాల్లోకి అమెరికాను అనుమతించేందుకు భారత్ ఒప్పుకోవడం లేదు. ఇండియాపై ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గడం లేదు. దీంతో, పరస్పర సుంకాల అమలులోకి రావడానికి జూలై 09 తుది గడువుగా ఉన్నప్పటికీ, ఆలోపు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరడం కష్టంగానే కనిపిస్తోంది.

ప్రభుత్వ వర్గాల ప్రకారం, భారతదేశంలో 80 మిలియన్ల మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న డెయిరీ రంగం విషయంలో భారత్ వెనక్కి తగ్గడానికి నిరాకరించింది. ఈ రంగంలో ఎక్కువగా చిన్న రైతులే ఉన్నారు. డెయిరీ రంగంలో అమెరికా ఒత్తిడిని ఒప్పుకునే ప్రశ్నే లేదని, దీనిని భారత్ ‘‘రెడ్ లైన్’’గా భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మంగళవారం వాషింగ్టన్‌లో రెండు దేశాల మధ్య చర్చలు ఆరో రోజుకు చేరుకున్నాయి. బుధవారం కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు, ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశం కానున్నారు.

Also Read

  • India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
  • Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్‌
  • Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
  • Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..

Read Also: Off The Record: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఏం చేయబోతున్నారు..?

ముఖ్యంగా, భారతదేశం వస్త్రాలు, దుస్తులు, రత్నాలు మరియు ఆభరణాలు, తోలు వస్తువులు, ప్లాస్టిక్‌లు, రసాయనాలు, రొయ్యలు, నూనెగింజలు, ద్రాక్ష,అరటిపండ్లు వంటి విస్తృత శ్రేణి శ్రమ-ఆధారిత రంగాలకు సుంకం రాయితీలను ఆశిస్తోంది. అయితే, ఈ రాయితీలు అమెరికా ప్రయోజనాలను దెబ్బతీయవని మన అధికారులు చెబుతున్నారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందం, విస్తృత ద్వైపాక్షిక ఒప్పందానికి మొదటి అడుగుగా భావిస్తున్నారు. ఈ ఒప్పందం భారత్‌ ఎగుమతులపై 26 శాతం అధిక సుంకాలను తొలగించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతానికి వ్యవసాయంపై భారత్ ఎలాంటి రాజీ పడకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయకుండా ఉండేందుకు దృఢమైన వైఖరిని అవలంబిస్తోంది. ముఖ్యంగా, వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాల్లో సుంకాల రాయితీలను అమెరికా నుంచి ఆశిస్తోంది. ఈ రంగాల్లోకి అమెరికాను అనుమతిస్తే, భారతీయ రైతుల జీవనోపాధిపై ప్రభావం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

పారిశ్రామిక ఉత్పత్తులు, ఎలక్ట్రిక్ వాహనాలు, వైన్లు, పెట్రోకెమికల్ వస్తువులు, పాడి మరియు ఆపిల్, చెట్టు గింజలు మరియు జన్యుపరంగా మార్పు చెందిన పంటలు వంటి వ్యవసాయ వస్తువులకు అమెరికా రాయితీ కోరుతున్నట్లు తెలుస్తోంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) యొక్క మొదటి దశ చర్చలను ఈ సంవత్సరం సెప్టెంబర్-అక్టోబర్ నాటికి ముగించాలని భారతదేశం మరియు అమెరికా లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 191 బిలియన్ డాలర్లుగా ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bilateral trade agreement India US
  • India agriculture trade
  • India dairy sector
  • India US trade deadlock
  • India-US Trade Deal

తాజావార్తలు

  • Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు

  • Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్‌ మోర్‌ అనాల్సిందే..

  • Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

  • India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?

  • Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions