India US Trade Dispute: ఆ సుంకాలపై చర్చలకు ట్రంప్ ఒప్పుకోవడం లేదు.. అమెరికాపై భారత్ ఫైర్!
- స్టీల్, అల్యూమినియం సుంకాలపై భారత్ ఆగ్రహం..
- జాతీయ భద్రత పేరుతో అమెరికా ఇష్టానుసారం వ్యవహరిస్తుంది..
- డబ్ల్యూటీవో కింద సంప్రదింపులకు యూఎస్ ఒప్పుకోవడం లేదు: భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India US Trade Dispute 2025: భారతదేశానికి చెందిన అల్యూమినియం, ఉక్కు, సంబంధిత ఉత్పత్తులపై అమెరికా టారీఫ్స్ విధించింది. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం కింద చర్చలకు రావాలంటూ భారత్ చేసిన అభ్యర్థనకు అగ్రరాజ్యం ఒప్పుకోవడం లేదని లోక్సభలో కేంద్ర వాణిజ్యం- పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించారు. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని వాటిని విధించినట్లు యూఎస్ వాదించిందని లిఖితపూర్వక సమాధానంలో ఆయన తెలియజేశారు. అయితే, దిగుమతి సుంకాల విషయంలో డబ్ల్యూటీవో అగ్రిమెంట్స్ ఆన్ సేఫ్గార్డ్స్ నిబంధనలను న్యూయార్క్ పాటించకపోవడంతో.. భారత్ సైతం అదే స్థాయిలో చర్యలు తీసుకునే హక్కును కలిగి ఉందని తెలియజేశారు. స్టీల్, అల్యూమినియంపై అమెరికా సుంకాల విధింపును రక్షణాత్మక చర్యలుగా ఇండియా భావిస్తుంది. డబ్ల్యూటీవో అగ్రిమెంట్స్ ఆన్ సేఫ్గార్డ్స్ కింద సంప్రదింపులకు లోబడి ఉండాల్సిన అంశంగా దీన్ని పరిగణిస్తున్నామని జితిన్ ప్రసాద చెప్పుకొచ్చారు.
Read Also: PVN Madhav: రాజధాని అమరావతిపై బీజేపీ ఏపీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
అయితే, అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న చర్చల్లో భారత్ చురుకుగా పాల్గొంటోందని మంత్రి మరో ఆన్సర్ లో తెలియజేశారు. రైతులు, దేశీయ పరిశ్రమల ప్రయోజనాలను కాపాడటానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై ఈ ఏడాది మార్చి నుంచి చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఐదు రౌండ్ల చర్చలు జరిగినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
-
Aadarsha Kutumbam AK47:వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్లో..మరో బ్యూటీ ఎంట్రీ..!
-
Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో “కాక్రోచ్” పేరుతో కొత్త పార్టీలు..
-
DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!