UN: పాకిస్తాన్ బుద్ధి వంకర.. స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India slams Pakistan for raking up Kashmir issue at UN: మరోసారి దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) సంస్కరణల గురించి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భంలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. అయితే భారత్ దీనికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్ అబద్దాలను ప్రచారం చేయడానికి తెగించి ప్రయత్నాలు చేస్తుందంటూ స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, విడదీయరాని భాగంగా ఉందని యూఎన్ లో భారతదేశ శాశ్వత మిషన్ ప్రతినిధి ప్రతీక్ మాథూర్ అన్నారు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు.. ఈ వ్యాఖ్యలే కారణం..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా పాకిస్తాన్ వేదికను దుర్వినియోగం చేస్తుందని భారత్ వ్యాఖ్యానించింది. అంతకుముందు ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధి, రాయబారి రుచిరా కాంబోజ్ యూఎన్ భద్రతామండలి ప్రాతినిథ్యంపై జీ4 దేశాల ప్రతిపాదనను అందించారు. భద్రతామండలిలో సంస్కరణలు చాలాకాలంగా నిలిచిపోయాయని ఆమె అన్నారు. జీ4 దేశాలు అయిన బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఇండియాల తరుపున రుచికా కాంజోజ్ మాట్లాడారు.
భారతదేశానికి ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యదేశ హోదా ఇవ్వాలని చాలా రోజుల నుంచి కోరుతోంది. ప్రస్తుతం భద్రతా మండలిలో అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకేలు శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. అయితే చాలా కాలం నుంచి భారత్ తో పాటు మరికొన్ని దేశాలు భద్రతామండలిని సంస్కరించాలని కోరుతున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ కు ఇందులో సభ్యత్వం లేకపోవడం భద్రతా మండలికి నిండుతనం తీసుకురాలేదని భారత్ పలుమార్లు యూఎన్ లో వ్యాఖ్యానించింది. అయితే చైనా తప్పా.. మిగతా నాలుగు దేశాలు యూఎన్ లో భారత్ కు శాశ్వత సభ్యదేశ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే చైనా మాత్రం తన వీటో అధికారంలో భారత్ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!