ATM Withdraw: రూ.10 వేలు విత్డ్రా చేస్తే రూ.3 లక్షలొచ్చాయి. అసలు కథేంటంటే..!
- రూ.10 వేలు విత్డ్రా చేస్తే రూ.3 లక్షలొచ్చాయి
- సూరత్లో విచిత్రమైన సంఘటన
- ఓ బ్యాంక్ ఖాతాదారుడు భారీ విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏటీఎం సెంటర్లలో అప్పుడప్పుడు టెక్నికల్ సమస్యలు వస్తుంటాయి. ఏటీఎం కార్డు పెట్టినప్పుడు డబ్బులు రాకుండా నిష్క్రమించాక నగదు వచ్చిన దాఖలాలు ఎదురవుతుంటాయి. కానీ ఆ డబ్బు వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంటాయి. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. దీంతో బాధితులు లబోదిబో అంటుంటారు.
ఇక సూరత్లో విచిత్రమైన సంఘటన కస్టమర్కు ఎదురైంది. సూరత్కు చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారుడు ఎస్బీఐ ఏటీఎం నుంచి రూ. 10,000 విత్డ్రా చేశాడు. కానీ ఏటీఏం సాంకేతిక లోపం కారణంగా నగదు రాలేదు. రసీదు కూడా రాలేదు. కానీ 10, 000 విత్డ్రా అయినట్లుగా 2017 ఫిబ్రవరి 18న మెసేజ్ వచ్చింది. దీంతో వినియోగదారుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. 2017 ఫిబ్రవరి 21న బ్యాంక్ ఆఫ్ బరోడా డంభల్ శాఖలో లిఖితపూర్వకంగా బాధితుడు ఫిర్యాదు చేశాడు. కానీ బాధితుడి గోడు పట్టించుకున్న నాధుడు లేడు.
Also Read
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర...వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
ఆర్బీఐ, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇక సీసీటీవీ ఫుటేజ్ పొందడానికి ఎస్బీఐలో ఆర్టీఐ అభ్యర్థనను దాఖలు చేశాడు. అయితే ఏ అధికారి కూడా సమాధానం ఇవ్వలేదు. బాధితుడు లెక్కలేనన్ని ఈ-మెయిళ్లు, అనేక ఫిర్యాదులు చేశాడు. చివరగా డిసెంబర్ 20, 2017న వినియోగదారుల ఫోరమ్ను ఆశ్రయించాడు. విచారణ సందర్భంగా ఆ ఏటీఎం ఎస్బిఐకి చెందినదని.. తమ రికార్డుల్లో లావాదేవీ ‘‘విజయవంతంగా’’ కనిపించిందని.. అందువల్ల బ్యాంకు బాధ్యత వహించదని బ్యాంక్ ఆఫ్ బరోడా వాదించింది. అయితే వినియోగదారుల కమిషన్ బ్యాంక్ వాదనను తోసిపుచ్చింది. లావాదేవీకి సంబంధించిన పక్కా రుజువులను బ్యాంకు తప్పనిసరిగా అందించాలని పేర్కొంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆ మొత్తాన్ని ఐదు రోజుల్లోగా వాపసు చేయాలని ఆదేశించింది. కానీ బ్యాంకు అలా చేయడంలో విఫలం కావడంతో కమిషన్ సీరియస్గా తీసుకుంది.
దీంతో అసలు రూ.10,000తో పాటు 9 శాతం వార్షిక వడ్డీతో వాపసు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఆలస్యానికి రోజుకు రూ.100 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కూడా సూచించింది. దీంతో 2026 ఫిబ్రవరి 26 నాటికి జాప్యం 3,288 రోజులకు చేరింది. మొత్తం పరిహారం రూ. 3,28,800కు పెరిగింది. ఇక మానసిక వేధింపులకు గాను రూ. 3,000, న్యాయపరమైన ఖర్చుల నిమిత్తం రూ. 2,000 చెల్లించాలని కూడా బ్యాంకుకు కమిషన్ ఆదేశించింది. దీంతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పుడు అసలు మొత్తానికి దాదాపు 30 రెట్లు చెల్లించవలసి వస్తోంది. ఈ సీన్ చూస్తుంటే.. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడమంటే ఇదేనేమో అనిపిస్తోంది.
తాజావార్తలు
-
H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
-
HYDRAA : మురుగు చెరువు నుంచి టూరిజం స్పాట్.. సున్నం చెరువు సరికొత్త లుక్.!
-
150 Words on One Sticky Note: ఒకే స్టిక్కీ నోట్పై 150 పదాలు.. భారత సంతతి క్లౌడ్ ఇంజనీర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు!
-
AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
-
England Team: 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. 20 వికెట్లు వారి ఖాతాలోనే..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?