India Economy: 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India set to become 3rd largest economy by 2030: ప్రపంచం అంతా మాంద్యం అంచున ఉంటే ఒక్క భారత్ మాత్రమే వృద్ధి రేటులో దూసుకెళ్తోంది. ఇప్పటికే యూకేను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించింది ఇండియా. రానున్న కాలంలో మరింత వేగంగా భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2030 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2028-30 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరించనున్నట్లు మాజీ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ విర్మణీ అన్నారు.
అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్), బ్లామ్ బర్గ్ నివేదికల ప్రకారం ఈ ఏడాది భారత్ 7 శాతం వృద్ధిరేటు సాధిస్తుందని అంచానా వేస్తున్నాయి. ఇన్నాళ్లు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న యూకేను వెనక్కు నెట్టి భారత్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. దశాబ్ధం క్రితం భారత్ 11వ స్థానంలో ఉండేది. ప్రస్తుతం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఇండియా, బ్రిటన్ దేశాలు ఉన్నాయి. అయితే మరో ఏడేళ్లలో జపాన్, జర్మనీలను వెనక్కి నెట్టి భారత్ మూడో స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉంది.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
Read Also: Nithyananda: విషమంగా నిత్యానంద ఆరోగ్యం.. కాపాడాలంటూ శ్రీలంక అధ్యక్షుడికి లేఖ
ఐఎంఎఫ్ గణాంకాలు, చారిత్రాత్మక ఎక్సెంజ్ రేట్ల ఆధారంగా బ్లూమ్ బర్గ్ వేసిన లెక్కల ప్రకారం బ్రిటన్ నున అధిగమించి ఐదోస్థానంలోకి చేరింది. జనవరి, మార్చిలో భారత ఆర్థిక వ్యవస్థ విలువ 854.7 బిలియన్ డాలర్లగా తేలింది. యూకే ఆర్థిక వ్యవస్థ 816 బిలియన్ డాలర్లుగా తేలిందని.. బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. ఇప్పుడు ప్రపంచంలో అధిక వృద్ధిరేటు సాధిస్తున్న దేశంగా భారత్ ఉండటంతో మరికొన్ని రోజుల్లో బ్రిటన్, ఇండియాల మధ్య అంతరం మరింతగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.
మరోవైపు 2029నాటికి మూడో స్థానానికి చేరుతుందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ జీడీపీ వాటా 2014లో 2.6 శాతం ఉంటే ఇప్పుడు 3.5కు చేరింది. 2027నాటికి 4 శాతానికి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం జర్మనీ ఈ స్థానంలో ఉంది. అయితే 2014 నుంచి భారత్ అనుసరిస్తున్న విధానాలను చూస్తే 2030 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!