XE Variant: భారత్లో కొత్త రకం కరోనా.. లక్షణాలు ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫస్ట్ వేవ్.. సెకండ్ వేవ్.. థర్డ్ వేవ్… వరుసగా మూడు కరోనా వేవ్లను చేశాం.. ఈ సమయంలో.. ఎన్నో వేరియంట్లు వెలుగు చూశాయి.. కొన్ని ప్రమాదకరంగా మారగా.. కొన్ని అంతగా ప్రభావాన్ని చూపలేకపోయాయి. అయితే, ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి తగ్గుతోన్న తరుణంలో… కొత్తరకం వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల బ్రిటన్లో వెలుగు చూసిన కొత్తరకం ఎక్స్ఈ వేరియంట్ భారత్లోనూ వెలుగుచూసింది. తొలి కేసు ముంబైలో నమోదైనట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. అంతేకాకుండా కప్పా వేరియంట్ నమోదైనట్లు తెలిపింది. ఈ కొత్త రకం వెలుగు చూసిన బాధితుల్లో… ఇప్పటి వరకు తీవ్ర లక్షణాలేవీ లేవని పేర్కొంది.
Read Also: Telangana: టీఆర్ఎస్ రాస్తారోకో, ధర్నాలకు అనుమతిలేదు.. స్పష్టం చేసిన ప్రభుత్వం
Also Read
- Beggar Woman’s Surprising Savings: జీవితాంతం వీధుల్లో భిక్షాటన చేసిన మహిళ.. మరణానంతరం బయటపడ్డ రూ.8.40 లక్షలు!
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
- Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
సాధారణ కోవిడ్ పరీక్షల్లో భాగంగా ముంబైకి చెందిన 230 మంది బాధితుల నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించారు. వీటిలో 228 మందిలో ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. ఒకరిలో కప్పా, మరొకరిలో ఎక్స్ఈ బయటపడింది. మొత్తం 230 మందిలో 21మంది బాధితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా, వీరిలో ఎవరికీ ఆక్సిజన్ అవసరం రాలేదు. ఆస్పత్రిలో చేరిన బాధితుల్లో 12 మంది వ్యాక్సిన్ తీసుకోని వారే ఉన్నారని చెబుతున్నారు అధికారులు.. అయితే, ఒమిక్రాన్ ఉప రకాలైన బీఏ.1, బీఏ.2ల మిశ్రమం ఉత్పరివర్తనంగా భావిస్తోన్న ఈ వేరియంట్… అధిక సాంక్రమికశక్తి కలిగివున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వేరియంట్ వ్యాప్తి, తీవ్రతపై స్పష్టమైన ఆధారాలు లేవు. ఒమిక్రాన్లో ఇప్పటి వరకు ఉన్న ఇతర ఉత్పరివర్తనాల కంటే… దాదాపు 10శాతం ఎక్కువ వ్యాపించే గుణం ఉన్నట్లు బ్రిటన్ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. తాజాగా ఇది భారత్లోకి ప్రవేశించడంతో మరోసారి అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది కేంద్రం.. కోవిడ్ థర్డ్ వేవ్ ముగిసి.. క్రమంగా పాజిటివ్ కేసులు సంఖ్య దిగివచ్చిన తరుణంలో.. వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఇప్పుడు మళ్లీ టెన్షన్ పెడుతోంది.
తాజావార్తలు
-
Janvi : డర్టీ ఇమేజ్ నుంచి బయట పడాల్సింది పోయి ఇవేం పనులు జాన్వీ?
-
Beggar Woman’s Surprising Savings: జీవితాంతం వీధుల్లో భిక్షాటన చేసిన మహిళ.. మరణానంతరం బయటపడ్డ రూ.8.40 లక్షలు!
-
Violence Unlimited : సినిమా రంగానికి బాధ్యత లేదా?
-
Lava Virat V1 Pro 5G: లావా విరాట్ V1 ప్రో 5G రిలీజ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్లు ఇవే
-
Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!