ఒమిక్రాన్ ఎంట్రీతో ప్రారంభమైన కరోనా థర్డ్వేవ్ విజృంభణ తగ్గుముఖం పట్టింది.. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది.. తాజాగా కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,273 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. మరో 243 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.
Read Also: Ukraine Russia War: రష్యాకు బిగ్ షాక్.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం..!
ఇక, 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా మరో 20,439 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్రం.. పాజిటివిటీ రేటు 1.0 శాతానికి పడిపోయింది.. యాక్టివ్కేసుల సంఖ్య 1,11,472గా ఉంది… ఇప్పటి వరకు మృతిచెందిన కోవిడ్ బాధితుల సంఖ్య 5,13,724కు చేరుకోగా.. కోలుకున్నవారి సంఖ్య 4,22,90,921కు పెరిగింది.. మరోవైపు, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.. శనివారం ఒకేరోజు 24,05,049 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు పంపిణీ చేసిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 177,44,08,129కు చేరింది.