India On Nepal: నేపాల్ ప్రధానికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. ఎందుకంటే..
- సరిహద్దు వివాదంలో మూడో పక్షం జోక్యాన్ని తిరస్కరించిన భారత్.
- నేపాల్ ప్రధాని బాలెన్ షా వ్యాఖ్యలకు భారత్ కౌంటర్.
- భారత్-నేపాల్ సరిహద్దులో 98 శాతం గుర్తింపు పూర్తయిందని విదేశాంగ శాఖ.
- లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ ప్రాంతాలపై కొనసాగుతున్న వివాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India On Nepal: భారత్తో సరిహద్దు వివాదంపై నేపాల్ ప్రధాని బాలెన్ షా ప్రగల్భాలు పలకడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేపాల్తో ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవడానికి మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ ప్రాంతాలపై రెండు దేశాల మద్య వివాదం ఉంది. అయితే, ఇటీవల ఈ మార్గాల ద్వారా చైనాతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించడంపై నేపాల్ తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది.
ఇటీవల నేపాల్ పార్లమెంట్లో ఆ దేశ ప్రధాని బాలెన్ షా మాట్లాడుతూ.. సమస్య పరిష్కారానికి బ్రిటన్, చైనాలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ వివాదంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. సరిహద్దు సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించుకోవడానికి ఇరుపక్షాలు ద్వైపాక్షిక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకున్నాయని, భారత్-నేపాల్ సరిహద్దులో సుమారు 98 శాతం సరిహద్దును గుర్తించామని చెప్పారు.
Also Read
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
- Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
- Kulgam: కుల్గామ్లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
- Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీ ప్రాంతాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాగమని భారత్ చెబుతుంది. అయితే, ఈ ప్రాంతాలు తమవే అని నేపాల్ వాదిస్తోంది. కేపీ శర్మ ఓలీ నేపాల్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ వివాదం చెలరేగింది. బాలెన్ షా ఇటీవల మాట్లాడుతూ.. నేపాల్ కూడా భారత భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పడం వివాదాస్పదమైంది. ఆయన ప్రకటనపై సొంతదేశంలోని నెటిజన్లే విమర్శలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!