Dalai Lama: ‘‘దలైలామా తప్పా వారసుడిని ఎవరూ నిర్ణయించలేరు’’.. చైనాకు భారత్ షాక్..
- దలైలామానే తన వారసుడిని నిర్ణయిస్తారు..
- చైనా వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dalai Lama: దలైలామా ఉనికి లేకుండా చేసేందుకు డ్రాగన్ కంట్రీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. దలైలామా పునర్జన్మను ఆమోదించాలని చైనా డిమాండ్ చేసింది. ఈ ప్రకటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టిబెటన్ ఆధ్యాత్మక గురువు దలైలామాకు తప్పా తన వారసుడిని నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని భారత్ చెప్పింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఒక ప్రకటనలో.. ‘‘దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులకు అత్యంత ముఖ్యమైనది. ఆయనకు మాత్రమే ఆయన వారసుడిని నిర్ణయించుకునే హక్కు ఉంది’’ అని అన్నారు.
Read Also: Car Sales: తగ్గిన టాటా కార్ల అమ్మకాలు.. నంబర్ వన్గా మారుతి సుజుకి.. రెండో స్థానంలో…
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
దలైలామా 90వ పుట్టిన రోజు కార్యక్రమానికి కిరణ్ రిజిజుతో పాటు జేడీయూ నేత లల్లన్ సింగ్ భారత ప్రభుత్వ ప్రతినిధులుగా ధర్మశాలను సందర్శిస్తారు. చైనా బహిష్కృత ఆధ్యాత్మిక నేత, తన 600 ఏళ్ల సంస్థ తన జీవిత కాలం తర్వాత కూడా కొనసాగుతుందని కేంద్రమంత్రి ప్రకటించారు. 5వ దలైలామా ఎంపిక పూర్తిగా దలైలామా అధికారిక కార్యాలయం అయిన గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్పై ఉంటుందని ఆయన అన్నారు.
దీనికి ముందు, చైనా విదేశాంగ ప్రతినిది మావో నింగ్ మాట్లాడుతూ.. ‘‘దలైలామా వారసత్వం చైనా చట్టాలు మరియు నిబంధనలతో పాటు మతపరమైన ఆచారాలు, చారిత్రక సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలి’’ అని అన్నారు. దీనిని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. చైనా పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు విఫలం కావడంతో లాసా నుంచి 1959లో శరణు కోరుతూ దలైలామా భారత్ ఆశ్రయం కోరారు. అప్పటి నుంచి భారత్ లోనే నివసిస్తున్నారు. చైనా ఆక్రమించిన టిబెట్ ను వేరు చేయాలనే దలైలామాను చైనా వేర్పాటువాదిగా ముద్ర వేస్తోంది. 1950లో చైనా టిబెట్ని ఆక్రమించుకుంది.
తాజావార్తలు
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
-
Tollywood: మళ్లీ ట్రెండ్లోకి రాయలసీమ యాస.. స్టార్ హీరోల కొత్త ట్రెండ్ ఇదేనా ?
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!