Pakistan: భారత్ దాడులకు ప్లాన్ చేస్తోంది.. భారతీయులు మూల్యం చెల్లించక తప్పదు : పాక్ రక్షణ మంత్రి
- మా దేశంలో భారీ దాడులకు భారత్ ప్లాన్ చేస్తోంది..
- సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ రక్షణ మంత్రి..
- భారతీయులు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ లోలోపల భయపడుతూనే, భారత ప్రతీకారాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎల్ఓసీ వద్ద పాకిస్తాన్ తన సైన్యాన్ని మోహరించింది. ఈ రోజు పాక్ ప్రధాని షెహజాబ్ షరీఫ్ నేతృత్వంలో హై లెవల మీటింగ్ జరిగింది. దీని తర్వాత, భారత్పై ప్రతీకార చర్యలకు పాల్పడింది. భారత విమానాలకు పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసేయడంతో పాటు ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపేస్తున్నట్లు, వాణిజ్యాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
Read Also: Rahul Gandhi: ‘‘ఏ చర్యకైనా ఫుల్ సపోర్ట్ ఉంటుంది’’.. కేంద్రానికి రాహుల్ గాంధీ మద్దతు..!
Also Read
- Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
- Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
- CJP Protest: జంతర్ మంతర్ వీడేదిలేదు.. మరోసారి పార్లమెంట్ మార్చ్.. సీజేపీ స్పష్టమైన హెచ్చరిక
ఇదిలా ఉంటే, తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్ పూర్తి యుద్ధానికి బదులుగా, విస్తృత ఉగ్రవాద దాడిని ప్లాన్ చేస్తోంది’’అని ఆరోపించారు.”మా సమాచారం ప్రకారం, భారతదేశం పూర్తి యుద్ధానికి బదులుగా పాకిస్తాన్ అంతటా విస్తృత ఉగ్రవాద దాడులను ప్లాన్ చేస్తోంది. ఆ ఉగ్రవాద దాడుల్ని మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. అయితే, అలా జరిగితే, అది ప్రతిఫలంగా ఉంటుంది. పాక్ పౌరులు సురక్షితంగా లేకుంటే, వారిపై దాడి జరిగితే, భారత పౌరులు సురక్షితంగా ఉండరు. భారత్ చేసిన దాడి కారణంగా ఒక్క పాకిస్తాన్ పౌరుడు మరణించినా, భారతదేశం భారీ మూల్యం చెల్లించేలా చేస్తాం” అని ఆసిఫ్ అన్నారు.
పాకిస్తాన్ తన సార్వభౌమాధికారం, భద్రతకు ఏదైనా ముప్పు కలిగితే దృఢమైన ప్రతిస్పందన ఎదుర్కుంటారని భారత్కి వార్నింగ్ ఇచ్చింది. భారత్ రాజకీయ ఎజెండానున ముందుకు తీసుకెళ్లడానికి పహల్గామ్ వంటి సంఘటనల్ని వాడుకుంటుందని పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశం తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. సింధు జలాల ఒప్పందం రద్దుని ‘‘యుద్ధ చర్య’’గా పాకిస్తాన్ అభివర్ణించింది.
తాజావార్తలు
-
Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
-
Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
-
Chennai LoveStory : ‘చెన్నై లవ్స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
-
Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
-
AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!