Govt on Congress: ‘‘మెలోని’’పై కాంగ్రెస్ జోక్ వివాదం.. స్పందించిన విదేశాంగ శాఖ..
- జార్జియా మెలోనిపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రం..
- భారత్, ఇటలీ మధ్య బలమైన సంబంధాలున్నాయన్న విదేశాంగ శాఖ..
- ద్వైపాక్షిక సంబంధాల్లో పరస్పర గౌరవం, అవగాహన కీలకమని వ్యాఖ్య..
- రాహుల్ గాంధీ ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Govt on Congress: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ‘‘మనకు ఇటలీతో బలమైన సంబంధాలు ఉన్నాయి. వాటిని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నాము. ద్వైపాక్షిక సంబంధాల్లో పరస్పర గౌరవం, అవగాహన ఎంతో ముఖ్యం. ఏ విషయాన్నైనా గౌరవంగా ముందుకు తీసుకురావాలి’’ అని విదేశాంగ ప్రతినిధి అన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీ విదేశాంగ విధానంపై విమర్శలు చేస్తూ జార్జియా మెలోని ప్రస్తావన తీసుకువచ్చారు.
గురువారం ఢిల్లీలో క్రియేటివ్ కాంగ్రెస్ సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. విదేశాంగ విధానం అంటే కౌగిలించుకోవడం అనే ఆలోచన ఆయన బుర్రలోకి ఎలా వచ్చింది? అంటూ వ్యాఖ్యానించారు. సెటైరికల్గా కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ను స్టేజ్పై కౌగిలించుకున్నారు. అయితే, ఆ సమయంలో సందీప్ దీక్షిత్ రాహుల్ గాంధీతో ‘‘నన్ను మీరు మెలోనీ అనుకోలేదు కదా?’’ అని అన్నారు. దీంతో అక్కడ ఉన్న వారంతా నవ్వారు. దీనికి సమాధానంగా రాహుల్ గాంధీ..‘‘నేను ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు’’ అని అన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Also Read
- Yogi Adityanath: "1947లో మోడీ ప్రధానిగా ఉండుంటే".. కాంగ్రెస్, దేశ విభజనపై యోగి సంచలనం..
- CJI Surya Kant: యువతను తప్పుదారి పట్టించారు.. ‘‘బొద్దింక’’ వ్యాఖ్యలపై సీజేఐ సూర్యకాంత్ క్లారిటీ..
- RG Kar Case: ఆర్జీ కర్ ఆగ్రహం.. టీఎంసీ మాజీ ఎమ్మెల్యేకు చెప్పుల దండ, గుడ్లతో దాడి
- IMD Alert: ఎర్రకోట వేడుకలకు వరుణుడు అడ్డంకి.. ఐఎండీ హెచ్చరిక
కాంగ్రెస్, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తూ, దేశాన్ని నడిపించడానికి పరిణతి చెందిన నాయకత్వం అవసరమని అన్నారు. ప్రధాని మోదీని అవమానించే వ్యాఖ్యలు చేయడం ద్వారా రాహుల్ గాంధీ దేశ ప్రజలను కూడా అవమానిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గతంలో పలువురు విదేశాల అధినేతల్ని ఆలింగనం చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Govt on Congress: ‘‘మెలోని’’పై కాంగ్రెస్ జోక్ వివాదం.. స్పందించిన విదేశాంగ శాఖ..
-
Vijay Mallya: వేల కోట్లు ఎగగొట్టి పోయిన విజయ్ మాల్యా చుట్టూ మళ్లీ హాట్ టాపిక్.. ఎంత వసూలైంది? ఎంత మిగిలిందంటే?
-
CM Revanth Reddy : విద్యతోనే సామాజిక మార్పు, రాజ్యధికారం
-
Yogi Adityanath: “1947లో మోడీ ప్రధానిగా ఉండుంటే”.. కాంగ్రెస్, దేశ విభజనపై యోగి సంచలనం..
-
CJI Surya Kant: యువతను తప్పుదారి పట్టించారు.. ‘‘బొద్దింక’’ వ్యాఖ్యలపై సీజేఐ సూర్యకాంత్ క్లారిటీ..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!