SCO Summit: ఎస్సీఓ సమావేశానికి పాక్ విదేశాంగ మంత్రికి భారత్ ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SCO Summit: ఈ ఏడాది షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది. భారత్ లో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోను భారత్ సమావేశాలకు రావాల్సిందిగా ఆహ్మానించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంతో ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ ద్వారా ఆహ్వానాలు వెళ్లాయి. ఎస్సీఓ విదేశాంగ మంత్రులు, ఆయా దేశాల ప్రధాన న్యాయమూర్తుల సమావేశం మే మొదటి వారంలో గోవా వేదికగా జరగనుంది. దీని కోసం బిలావల్ భుట్టోతో పాటు పాక్ సీజేఐ ఉమర్ అటా బండియల్ లకు భారత్ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి.
Read Also: Lakhimpur Kheri Case: యూపీ రైతుల హత్య కేసులో కేంద్రమంత్రి కుమారుడికి బెయిల్..
Also Read
- Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
చైనా, భారతదేశం, కజకిస్తాన్, కిర్గిజ్ స్తాన్, పాకిస్తాన్, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ దేశాలు ఎస్సీఓలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఎస్సీఓకు ఈ ఏడాది భారత్ అధ్యక్షత వహిస్తోంది. సెప్టెంబర్ నెలలో అధ్యక్ష బాధ్యతలను తీసుకుంది. అయితే ఈ ఆహ్వానాలపై పాకిస్తాన్ ప్రభుత్వ స్పందించలేదు. ఒక వేళ అంగీకరిస్తే ఒక దశాబ్ధం తరువాత పాకిస్తాన్ మంత్రి భారత్ లో తొలిసారిగా పర్యటించడం అవుతుంది. 2011లో చివరి సారిగా అప్పటి విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ భారత్ లో పర్యటించారు.
ఇదిలా ఉంటే జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ – పాక్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి ఇరు దేశాలు అంటీముట్టనట్లు ఉంటున్నాయి. ఇటీవల బిలావల్ భుట్టో ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ పై ముఖ్యంగా ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ కసాయిగా అభివర్ణించాడు. ఇది ఇరుదేశాల మధ్య మరోసారి అగ్నికి ఆజ్యాన్ని పోసింది. అయితే భారత ఆహ్వానాన్ని పాక్ అంగీకరిస్తుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
-
Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
-
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!