Pakistan: ‘‘అవును, భారత్ బ్రహ్మోస్తో మా ఎయిర్బేస్లపై దాడి చేసింది’’..ఒప్పుకున్న పాక్ ప్రధాని..
- అవును , భారత్ బ్రహ్మోస్తో మా ఎయిర్బేస్లపై దాడి చేసింది..
- తాము దాడి చేసే లోపే భారత్ క్షిపణులను ప్రయోగించింది..
- ఎట్టకేలకు ఒప్పుకున్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్..
- మిత్రదేశం అజర్ బైజాన్ పర్యటనలో షరీఫ్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ జరిపిన దాడుల్లో తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పుకుంటూ వస్తున్న దాయాది పాకిస్తాన్, ఒక్కొక్కటిగా నిజాలను చెబుతోంది. తాజాగా, పాకిస్తాన్ ప్రధాని భారత్ తమపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసిందని ఒప్పుకున్నారు. మే 9-10 రాత్రి భారత్ రావల్పిండిలోని ఎయిర్బేస్తో సహా కీలక సైనిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసింది, తాము చర్య తీసుకునే సమయానికి ముందే దాడి జరిగిందని, పాకిస్తాన్ సైన్యం ఈ దాడుల్లో చిక్కుకుందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు.
Read Also: Delhi Alert: ఢిల్లీకి దుమ్ము తుఫాన్ హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
పాక్ మిత్ర దేశమైన అజర్ బైజాన్లో ప్రస్తుతం షహజాబ్ షరీఫ్ పర్యటిస్తున్నారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ వ్యా్ఖ్యలు చేశారు. పాక్ ఆర్మీ ఫీల్డ్ మార్షన్ ఆసిమ్ మునీర్ నేతృత్వంలో పాక్ సైన్యం మే 10 ఉదయం ప్రార్థనల తర్వాత భారతదేశంపై దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు చెప్పారు. అయితే, తెల్లవారకముందే పాకిస్తాన్లోని వివిధ ప్రావిన్సుల్లోని వైమానిక స్థావరాలపై భారత్ లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ మిస్సైల్ బ్రహ్మోస్ ని ప్రయోగించిందని పాక్ ప్రధాని అన్నారు.
“మే 9-10 రాత్రి, భారత దురాక్రమణకు మేము తగిన విధంగా స్పందించాలని నిర్ణయించుకున్నాము. గుణపాఠం నేర్పడానికి ఫజ్ర్ ప్రార్థనల తర్వాత ఉదయం 4.30 గంటలకు మన సాయుధ దళాలు చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆ గంట రాకముందే, భారతదేశం మరోసారి బ్రహ్మోస్ను ఉపయోగించి క్షిపణి దాడిని ప్రారంభించింది, రావల్పిండిలోని విమానాశ్రయంతో సహా పాకిస్తాన్లోని వివిధ ప్రావిన్సులను లక్ష్యంగా చేసుకుంది” అని షరీఫ్ లాచిన్లో తన ప్రసంగంలో అన్నారు.
Read Also: PM Modi: పాకిస్తాన్ గడ్డపై మూడుసార్లు దాడి చేశాం.. “సిందూర్” ఇంకా ముగియలేదు..
పాకిస్తాన్పై మే 10న భారత్ తీవ్ర దాడి చేసింది. భారత సైనిక స్థావరాలు, సివిల్ ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్, క్షిపణులని పాకిస్తాన్ ప్రయోగించిన తర్వాత, భారత్ పాక్ వైమానిక ఆస్తులే లక్ష్యంగా విరుచుకుపడింది. పాక్ సైన్యం హెడ్ క్వార్టర్ అయిన రావాల్పిండికి సమీపంలో ఉన్న నూర్ ఖాన్తో పాటు, రఫీకి, మురిద్, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్ మరియు చునియన్లోని పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారతదేశం దాడులు చేసింది. స్కార్డు, భోలారి, జకోబాబాద్ మరియు సర్గోధాలోని వైమానిక స్థావరాలు కూడా విస్తృతంగా దెబ్బతిన్నాయి. మొత్తం 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ విరుచుకుపడింది.
తాజావార్తలు
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!