Pakistan: ‘‘అవును, భారత్ బ్రహ్మోస్తో మా ఎయిర్బేస్లపై దాడి చేసింది’’..ఒప్పుకున్న పాక్ ప్రధాని..
- అవును , భారత్ బ్రహ్మోస్తో మా ఎయిర్బేస్లపై దాడి చేసింది..
- తాము దాడి చేసే లోపే భారత్ క్షిపణులను ప్రయోగించింది..
- ఎట్టకేలకు ఒప్పుకున్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్..
- మిత్రదేశం అజర్ బైజాన్ పర్యటనలో షరీఫ్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ జరిపిన దాడుల్లో తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పుకుంటూ వస్తున్న దాయాది పాకిస్తాన్, ఒక్కొక్కటిగా నిజాలను చెబుతోంది. తాజాగా, పాకిస్తాన్ ప్రధాని భారత్ తమపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసిందని ఒప్పుకున్నారు. మే 9-10 రాత్రి భారత్ రావల్పిండిలోని ఎయిర్బేస్తో సహా కీలక సైనిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసింది, తాము చర్య తీసుకునే సమయానికి ముందే దాడి జరిగిందని, పాకిస్తాన్ సైన్యం ఈ దాడుల్లో చిక్కుకుందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు.
Read Also: Delhi Alert: ఢిల్లీకి దుమ్ము తుఫాన్ హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
Also Read
- JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
- Donald Trump: "తీవ్రమైన దాడి చేస్తాం".. చర్చల వేళ ఇరాన్కు ట్రంప్ వార్నింగ్..
- Uddhav Shiv Sena: ఉద్ధవ్పై కోపం లేదు, నిధుల కోసమే తిరుగుబాటు: రెబల్ ఎంపీ..
- Uttar Pradesh: హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి వివాహం.. పోలీసులే పెళ్లి పెద్దలు..
పాక్ మిత్ర దేశమైన అజర్ బైజాన్లో ప్రస్తుతం షహజాబ్ షరీఫ్ పర్యటిస్తున్నారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ వ్యా్ఖ్యలు చేశారు. పాక్ ఆర్మీ ఫీల్డ్ మార్షన్ ఆసిమ్ మునీర్ నేతృత్వంలో పాక్ సైన్యం మే 10 ఉదయం ప్రార్థనల తర్వాత భారతదేశంపై దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు చెప్పారు. అయితే, తెల్లవారకముందే పాకిస్తాన్లోని వివిధ ప్రావిన్సుల్లోని వైమానిక స్థావరాలపై భారత్ లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ మిస్సైల్ బ్రహ్మోస్ ని ప్రయోగించిందని పాక్ ప్రధాని అన్నారు.
“మే 9-10 రాత్రి, భారత దురాక్రమణకు మేము తగిన విధంగా స్పందించాలని నిర్ణయించుకున్నాము. గుణపాఠం నేర్పడానికి ఫజ్ర్ ప్రార్థనల తర్వాత ఉదయం 4.30 గంటలకు మన సాయుధ దళాలు చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆ గంట రాకముందే, భారతదేశం మరోసారి బ్రహ్మోస్ను ఉపయోగించి క్షిపణి దాడిని ప్రారంభించింది, రావల్పిండిలోని విమానాశ్రయంతో సహా పాకిస్తాన్లోని వివిధ ప్రావిన్సులను లక్ష్యంగా చేసుకుంది” అని షరీఫ్ లాచిన్లో తన ప్రసంగంలో అన్నారు.
Read Also: PM Modi: పాకిస్తాన్ గడ్డపై మూడుసార్లు దాడి చేశాం.. “సిందూర్” ఇంకా ముగియలేదు..
పాకిస్తాన్పై మే 10న భారత్ తీవ్ర దాడి చేసింది. భారత సైనిక స్థావరాలు, సివిల్ ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్, క్షిపణులని పాకిస్తాన్ ప్రయోగించిన తర్వాత, భారత్ పాక్ వైమానిక ఆస్తులే లక్ష్యంగా విరుచుకుపడింది. పాక్ సైన్యం హెడ్ క్వార్టర్ అయిన రావాల్పిండికి సమీపంలో ఉన్న నూర్ ఖాన్తో పాటు, రఫీకి, మురిద్, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్ మరియు చునియన్లోని పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారతదేశం దాడులు చేసింది. స్కార్డు, భోలారి, జకోబాబాద్ మరియు సర్గోధాలోని వైమానిక స్థావరాలు కూడా విస్తృతంగా దెబ్బతిన్నాయి. మొత్తం 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ విరుచుకుపడింది.
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!