S-400 missile system: ఎస్-400తో సహా భారీ డిఫెన్స్ కొనుగోళ్లకు కేంద్రం ఓకే..
- భారీ రక్షణ కొనుగోళ్లకు కేంద్రం ఆమోదం..
- ఎస్-400 సహా కీలక ఆయుధ వ్యవస్థలకు ఓకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S-400 missile system: దేశ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం భారీ డిఫెన్స్ కొనుగోళ్లకు ఓకే చెప్పింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) సమావేశంలో రూ. 2.38 లక్షల కోట్ల విలువైన రక్షణ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ కొనుగోలు భారత సైన్యానికి ఆధునిక సాంకేతిక సామర్థ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం చెప్పింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్లను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ కొనుగోలు ఉండబోతోంది. భారీ కొనుగోలుకు సంబంధించిన విషయాన్ని రాజ్నాథ్ సింగ్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
భారత సైన్యం కోసం ఎయిర్ డిఫెన్స్ ట్రాక్డ్ సిస్టమ్, ఆర్మర్డ్ ఫియర్సింగ్ ట్యాంక్ మందుగుండు సామాగ్రి కొనుగోలు ద్వారా ట్యాంక్లపై దాడి సామర్థ్యం పెరుగుతుంది. హై కెపాసిటీ రేడియో రిలే, ధనుష్ గన్ సిస్టమ్, రన్ వే ఇండిపెండెంట్ సర్వైలెన్స్ సిస్టమ్స్కు ఆమోదం లభించింది. భారత కోస్ట్ గార్డు కోసం హెవీ డ్యూటీ ఎయిర్ కుషన్ వెహికిల్స్ కొనుగోలుకు డీఏసీ ఓకే చెప్పింది.
Also Read
- Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
- LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
- Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
- Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
Read Also: Iran Israel Conflict: ‘‘థాంక్యూ ఇండియా’’ అని రాసి మరీ, ఇజ్రాయిల్ను కొడుతున్న ఇరాన్…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బలోపేతం కోసం పాతబడిన AN-32, IL-76 విమానాల స్థానంలో మిడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ కొనుగోలుకు ఆమోదం లభించింది. అలాగే శత్రదేశాల మిస్సైల్స్, విమానాలు, డ్రోన్లను అడ్డుకోవడం కోసం రష్యా నుంచి S-400 మిసైల్ వ్యవస్థ కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇది సమర్థవంతంగా పనిచేసింది. రిమోట్గా నియంత్రించే స్టైక్ డ్రోన్లను కొనుగోలు చేయనున్నారు. సుఖోయ్-30 విమానాల ఇంజన్ భాగాల అప్గ్రేడ్ కోసం అనుమతి లభించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే భారీ స్థాయిలో రక్షణ కొనుగోళ్లకు ఆమోదం లభించినట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మొత్తం రూ. 6.73 లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి. రూ. 2.28 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి.
తాజావార్తలు
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్లో ఏం జరుగుతోంది?
-
LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!