Corona Cases: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 20,557 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మంగళవారం ఉదయం వరకు 15,528 కేసులు మాత్రమే నమోదు కాగా ఇవాళ భారీగా పెరిగాయి. ఇటీవల కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు తాజాగా 40 మంది కరోనా బారినపడి చనిపోయారు. కొవిడ్ నుంచి తాజాగా 18,517 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.47 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.13 శాతానికి తగ్గింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు దేశంలో మరో 4,98,034 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
Armed Forces: భారత త్రివిధ దళాల్లో 1.35లక్షల ఖాళీలు.. వెల్లడించిన కేంద్రం
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,28,388 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,43,091 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో మొత్తం కేసులు 4,38,03,619కి చేరగా.. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 4,31,13,623 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో భారత్లో 26,04,797 మందికి కరోనా వ్యాక్సిన్లు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 200.61 కోట్లు దాటింది. అటు ప్రపంచ దేశాల్లో మాత్రం కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 6,37,016 మంది వైరస్ బారినపడగా.. మరో 1,128 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 56,84,50,463కు చేరింది. ఇప్పటివరకు మహమ్మారి కారణంగా 63,89,332 మంది మరణించారు.