Iran War: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్లోని 140కి పైగా లక్ష్యాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇదిలా ఉంటే, హార్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఒమన్ తీరంలో ‘జిఎఫ్ఎస్ గెలాక్సీ’ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. దాడి సమయంలో నౌకలో 11 మంది భారతీయులు ఉన్నారు, ఇందులో 10 మందిని రక్షించామని, అయితే ఒక భారతీయులు గల్లంతయ్యాడని విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని ఒమన్లోని భారతీయ రాయబార కార్యలయం పేర్కొంది. గల్లంతైన ఒక్కరి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు ప్రకటించింది. ఈ దాడిపై భారత్ తీవ్ర విచారం, ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉందని భారత్ ప్రపంచానికి పిలుపునిచ్చింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆగిపోవాలని భారత్ తీవ్రంగా చెప్పింది.

