ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 42,766 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,95,716 కి చేరింది.
read also : మరోసారి భగ్గుమన్న పెట్రోల్ ధరలు..
ఇందులో 2,99,33,538 మంది కోలుకొని డిశ్చార్జ్కాగా, 4,55,033 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1,206 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,07,145 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 45,254 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.