India-Canada: కెనడాలో మరిన్ని కాన్సులర్ క్యాంపులను రద్దు చేసిన భారత్
- భారత్- కెనడాల మధ్య క్షిణిస్తున్న దౌత్య సంబంధాలు.. కెనడాలో మరిన్ని కాన్సులర్ క్యాంపులను రద్దు చేసిన భారత్ భారతీయులను అండగా ఉంటామని ఇండియన్ ఎంబసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada: కెనడాలో అధికారుల బెదిరింపులకు వ్యతిరేకంగా కనీస భద్రత కూడా అందించలేకపోవడంతో.. టొరంటోలోని మరికొన్ని భారత కాన్సులర్ క్యాంపులను రద్దు చేసినట్లు ప్రకటన జారీ చేసింది. నవంబరు 2, 3 తేదీల్లో బ్రాంప్టన్, సర్రేలోని రెండు శిబిరాలపై ఖలిస్తానీ గ్రూపులు జరిపిన దాడుల తర్వాత కెనడాలోని భారత హైకమిషన్ కొన్ని కాన్సులర్ క్యాంపులను క్యాన్సిల్ చేయాలని నిర్ణయించిన కొద్ది రోజుల తర్వాత తాజా చర్యలకు దిగింది.
Read Also: PAC Chairman Election: పీఏసీ ఎన్నిక.. చైర్మన్గా జనసేన ఎమ్మెల్యే..!
Also Read
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
- Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
కాగా, గ్రేటర్ టొరంటో ప్రాంతంలోని డయాస్పోరాలోని దాదాపు 4,000 మంది భారత్- కెనడియన్ ప్రజలకు అవసరమైన కాన్సులర్ సేవలను కోల్పోయిన.. వారికి తాము అండగా ఉంటామని కాన్సులేట్ ప్రకటించింది. ఇక, బ్రాంప్టన్లోని హిందూ సభా దేవాలయం ఆవరణలోకి ఖలిస్తానీ ఉగ్రవాదులు ప్రవేశించి అక్కడి భక్తులపై దాడి చేశారు. అంటారియో ప్రావిన్స్కు చెందిన పీల్ పోలీసులు ఖలిస్తానీ టెర్రరిస్టులపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. దీంతో కెనడాలో భద్రతా సమస్యల కారణంగా కాన్సులర్ సేవలను మూసివేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
Read Also: Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధానిపై అరెస్టు వారెంట్లు జారీ
ఇక, సిక్కులు ఫర్ జస్టిస్, నిషేధిత ఖలిస్థానీ అనుకూల సమూహం.. పరిపాలనా సేవలలో సహాయం చేయడానికి వచ్చిన భారతీయ కాన్సులర్ అధికారులపై తరచూ దాడులకు దిగుతున్నాయి. అలాగే, కెనడాలోని భారతీయులకు అవసరమైన సేవలను ఇండియన్ ఎంబసీ అందిస్తోంది. వీటిని భారత వ్యతిరేక శక్తులు లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే, గత సెప్టెంబరులో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కుట్రలో భారత రాయాబారుల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఆ తర్వాత నుంచి భారత్- కెనడాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణిస్తున్నాయి.
తాజావార్తలు
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
-
SEYON : శివకార్తికేయన్ & కమల్ హాసన్ ‘సెయాన్’ షూటింగ్ స్టార్ట్
-
Salman Khan: స్కూల్ పిల్లల కోసం..సల్మాన్ రూ.15 కోట్ల విరాళం..
-
Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..