Maldives: భారత్కి మాల్దీవుల కృతజ్ఞతలు.. EAM జైశంకర్ స్పందన ఇదే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: భారత్ని కాదని, చైనా అనుకూల వైఖరిని అవలంభిస్తున్నప్పటికీ, మాల్దీవులకు మన దేశం సాయం చేసింది. దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. ఆ దేశానికి అవసరమైన నిత్యావరసరాలను భారత్ ఎగుమతి చేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మాల్దీవులకు అవసరమైన వస్తువులను భారత్ సరఫరా చేసేందుకు అనుమతించింది. దీనిపై ఆ దేశ మంత్రి మూసా జమీర్ భారతదేశానికి ధన్యవాదాలు తెలిపారు. భారతదేశం తీసుకున్న నిర్ణయం రెండు దేశాల మధ్య చిరకాల స్నేహాన్ని, ద్వైపాక్షిక వాణిజ్యం మరియు వాణిజ్యాన్ని మరింత విస్తరించాలనే బలమైన నిబద్ధతను తెలియజేస్తోందని జమీర్ పేర్కొన్నారు.
జమీర్ ఎక్స్ వేదికగా…‘‘ 2024-25 సంవత్సరంలో భారత్ నుంచి అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడానికి మాల్దీవుల కోటాను పునరుద్ధరించినందుకు EAM జైశంకర్ మరియు భారత ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీర్ఘకాల స్నేహం, మా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించడానికి నిబద్ధతను సూచిస్తుంది’’ అని ట్వీట్ చేశారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
Read Also: Bandi Sanjay: ఆపన్న హస్తం కాదు, భస్మాసుర హస్తం.. కాంగ్రెస్పై బండి సంజయ్ ధ్వజం
మాల్దీవుల మంత్రి వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. ‘‘ యు ఆర్ వెల్కమ్..మూసాజమీర్. భారతదేశం తన పొరుగు దేశాలు ఫస్ట్ అనే విధానానికి, సాగర్ విధానాలకు కట్టుబడి ఉంది’’ అని అన్నారు. భారత్ చుట్టు పక్కల ఉన్న ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక ఫస్ట్ అనే విధానాన్ని అవలంభిస్తోంది.
మాల్దీవుల ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత్ 2024-25 ఆర్థిక్ సంవత్సరానికి గానూ మాల్దీవులకు 124,218 మెట్రిక్ టన్నుల బియ్యం, 109,162 టన్నుల గోధుమ పిండి, 64,494 టన్నుల చక్కెర, 21,513 మెట్రిక్ టన్నుల బంగాళదుంపలు, 35,749 టన్నుల ఉల్లిపాయలు మరియు 427.5 మిలియన్ గుడ్లను ఎగుమతి చేయడానికి భారత్ అనుమతించింది. దీంతో పాటు 1 మిలియన్ టన్నుల కంకర రాయి, నది ఇసుకను ఎగుమతి చేసేందుకు కూడా అనుమతించింది.
మాల్దీవులకు మహ్మద్ ముయిజ్జూ అధ్యక్షుడైన తర్వాత నుంచి ఆ దేశం చైనాకు సన్నిహితంగా వ్యవహరిస్తోంది. భారత్ని కాదని ముయిజ్జూ తన తొలి పర్యటన చైనాలో చేశారు. చైనాతో అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మాల్దీవుల్లో మానవతా సాయం అందిస్తున్న భారత సైనికులను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించారు. ఇదే కాకుండా ముయిజ్జూ ప్రభుత్వంలోని మంత్రులు ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దూరం పెరిగింది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!