Manipur Violence: మణిపూర్ హింసాత్మకం.. సహాయం చేయాలంటూ మేరికోమ్ అభ్యర్థన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ హింసాకత్మ సంఘటనలతో అట్టుడుకుతోంది. మెజారిటీ మైతై కమ్యూనిటీని షెడ్యూల్ తెగలో చేర్చే చర్యలను వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఇవి నెమ్మదిగా హింసాత్మక సంఘటనలకు దారి తీసింది. ప్రార్థనా మందిరాలు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెడుతున్నారు. ఈ క్రమంలో మణిపూర్ రాష్ట్రంలో ఆర్మీ, అస్సాం రైఫిల్స్ బలగాలు మోహరించాయి. రాజధాని ఇంఫాల్, చూరాచాంద్ పూర్, కాంగ్ పోక్పిలో ఘర్షణలు చెలరేగాయి. రాష్ట్రంలో 8 జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఆర్మీ శిబిరాలు, ప్రభుత్వ ప్రాంగణాల్లో 4 వేల మందికి ఆశ్రయం కల్పించారు.
Read Also: Sharad Pawar: ప్లాన్ ప్రకారమే శరద్ పవార్ రాజీనామా.. శివసేన పత్రిక సామ్నాలో కీలక వ్యాఖ్యలు..
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
మనిపూర్ హింసపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ తో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రం నిశితంగా గమనిస్తోంది. ఇదిలా ఉంటే సొంత రాష్ట్రం మణిపూర్ లో జరుగుతున్న విధ్వంసం గురించి ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. మా రాష్ట్రం మండిపోతోంది, సహాయం చేయాలని అని ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షాలను అభ్యర్థించారు.
షెడ్యూల్ తెగ స్టేటస్ కోసం గిరిజనేతర వర్గమైన మైతై వర్గం డిమాండ్ కు వ్యతిరేకంగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్(ఎటీఎస్యూఎం) చూరాచాంద్ పూర్ జిల్లాలోని తర్బుంగా ప్రాంతంలో ‘గిరిజన సంఘీభావ యాత్ర’కు పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో వేల మంది పాల్గొన్నారు. ఎస్టీ హోదా కోసం మైతై వర్గం చేసిన డిమాండ్ కు మణిపూర్ చట్ట సభ్యులు మద్దతు పలికారు. దీంతో ఈ చర్యపై గిరిజనులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిణామాలు రావణ కాష్టంగా మార్చాయి. గిరిజనులు, గిరిజనేతరులు మధ్య తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయింది. మణిపూర్ రాష్ట్రంలోని జనాభాలో 53 శాతం మంది మైతై వర్గానికి చెందిన వారే. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వస్తున్న అక్రమ వలసదారులతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పర్వత ప్రాంతాల్లో నివసించేందుకు మైతై వర్గానికి అనుమతి లేదు.
My state Manipur is burning, kindly help @narendramodi @PMOIndia @AmitShah @rajnathsingh @republic @ndtv @IndiaToday pic.twitter.com/VMdmYMoKqP
— Dr. M C Mary Kom OLY (@MangteC) May 3, 2023
తాజావార్తలు
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..