Maharastra: అధికార శివసేనకు బీజేపీ షాక్.. మూడు రాజ్యసభ స్థానాలు కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో అధికార పక్షానికి భారీ ఎదురుదెబ్బ తీగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. హర్యానా, మహరాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 16 స్థానాలకు ఎన్నికలు జరగగా.. 8 స్థానాలను బీజేపీ దక్కించుకుంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికల ముందు బీజేపీ పెద్దల సభలో తన బలాన్ని మరింతగా పెంచుకుంది.
ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని రాజ్యసభ సభ్యుల ఎన్నిక అందర్ని ఆకర్షించింది. మహారాష్ట్రలో మొత్తం 6 స్థానాలకు ఎన్నికలు జరిగితే 3 స్థానాలను బీజేపీ గెలుచుకుంటే.. ఒక్కో స్థానాన్ని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు గెలుచుకున్నాయి. కాగా ఇక్కడ బీజేపీ మూడో సీటు గెలుచుకోవడానికి తగినంత బలం లేకున్నా.. అనూహ్యంగా మూడో సీటును కూడా గెలుచుకుని అధికార మహావికాస్ అఘాడీ కూటిమికి షాక్ ఇచ్చింది. బీజేపీతో విభేదించి కాంగ్రెస్, ఎన్సీపీతో జట్టు కట్టిన శివసేనకు బీజేపీ తన సత్తా చూపింది. అధికారంలో ఉన్నా కూడా శివసేన తన అభ్యర్థిని గెలిపించుకోలేక చతికిల పడింది.
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
మహారాష్ట్రలోె బీజేపీ తరుపున కేంద్ర మంత్రి పియూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ పోటీ చేశారు. అయితే ధనంజయ్ మహాదిక్ గెలుపు పైనే అంతా ఫోకస్ పెట్టారు. బీజేపీ నుంచి ధనుంజయ్ మహాదిక్, శివసేన అభ్యర్థి సంజయ్ పవార్ పై విజయం సాధించారు. మొత్తం 284 ఓట్లలో పియూష్ గోయల్, అనిల్ బోండే కు 48 ఓట్లు రాగా.. మరో అభ్యర్థి విజయానికి 41 ఓట్లు అవసరం అయ్యాయి. అయితే ధనుంజయ్ మహాదిక్ 41.56 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన గెలుపొందారు. బీజేపీకి అనూహ్యంగా 10 ఓట్లు వచ్చాయి.
చాలా వరకు ఇండిపెండెంట్లు, కొన్ని పార్టీల ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేయడంతో పాటు జైల్లో ఉన్న నవాబ్ మాలిక్ ఓటేయడానికి కోర్టు అనుమతించకపోవడం శివసేన ఫలితాలను దెబ్బతీసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ నుండి ఇమ్రాన్ ప్రతాప్గర్హి, ఎన్సిపి నుండి ప్రఫుల్ పటేల్ మరియు సేన నుండి సంజయ్ రౌత్ ఎన్నికల్లో గెలుపొందారు. ఇక్కడ విశేషం ఏమిటంటే అధికార శివసేన అభ్యర్థి సంజయ్ రౌత్ కన్నా మహాదిక్ ఎక్కువ ఓట్లు పొందారు. సంజయ్ రౌత్ కు 41 ఓట్లు వస్తే, మహాదిక్ కు 41.5 ఓట్లు వచ్చాయి.
తాజావార్తలు
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!