Uttar Pradesh: కట్నం కోసం లైంగికంగా వేధించిన అత్తమామలు.. వివాహిత ఏం చేసిందంటే..!
- ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అంబేద్కర్ నగర్లో దారుణం..
- రూ. 2 లక్షల కట్నం కోసం మహిళను లైంగికంగా వేధించిన అత్తమామలు..
- భర్తతో పాటు అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అంబేద్కర్ నగర్కు చెందిన ఒక మహిళ తన భర్త, అత్తమామలు రూ. 2 లక్షల కట్నం ఇవ్వాలంటూ తనను లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. అయితే, 2011లో కమల్ అహ్మద్తో పెళ్లి జరిగిన వెంటనే తనపై వేధింపులు ప్రారంభమయ్యాయని మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
Read Also: Akkineni Akhil : ఎయిర్ పోర్టులో కొత్త జంట..
Also Read
అయితే, తన అత్తమామలు అస్మా ఖాటూన్, జునైద్ ఆలంలు రూ.2 లక్షల కట్నం తీసుకు రావాలని తనపై ఒత్తిడి చేసి.. అనేకసార్లు కొట్టడంతో పాటు చివరికి ఇంటి నుంచి గెంటేశారని చెప్పుకొచ్చింది. ఇక, తన తండ్రి ఏదో విధంగా లక్ష రూపాయలు ఇచ్చారు.. అయినా కూడా ఆ వేధింపులు ఆగలేదని తెలిపింది. అలాగే, తన మరిది బెలాల్ అహ్మద్ సైతం అనేకసార్లు లైంగికంగా వేధించాడు.. అతడికి అనుకూలంగా ఉండాలంటూ అత్తమామలు కూడా ఒత్తిడి తీసుకొచ్చారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించింది. మరోవైపు, 2019లో తన భర్త ఫిర్దౌస్ అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు.. ఆ తర్వాత తనను చంపేస్తానని బెదిరించాడని కంప్లైంట్ లో పేర్కొనింది. అలాగే, తన ఇద్దరు పిల్లలను కూడా నా నుంచి మా అత్తమామలు లాక్కున్నారు.. వారిని నాకు అప్పగించాలని కోరింది.
Read Also: Trump: ఆ రెండు దేశాలు పోట్లాడుకోవడం ఇష్టం లేదు
ఇక, ఈ సంఘటనపై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాలతో ఆ వివాహిత వరకట్న వేధింపులు, దాడి, హత్య బెదిరింపుల అభియోగాలతో కేసు నమోదు చేసింది. స్టేషన్ ఇన్చార్జ్ శివంగి త్రిపాఠి మాట్లాడుతూ.. ఈ విషయం చాలా సున్నితమైనది.. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.. విచారణ తర్వాత తగిన ఆధారాలతో నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Manchu Manoj : ‘ఐక్య’ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!
-
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!