Uttar Pradesh: కట్నం కోసం లైంగికంగా వేధించిన అత్తమామలు.. వివాహిత ఏం చేసిందంటే..!
- ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అంబేద్కర్ నగర్లో దారుణం..
- రూ. 2 లక్షల కట్నం కోసం మహిళను లైంగికంగా వేధించిన అత్తమామలు..
- భర్తతో పాటు అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అంబేద్కర్ నగర్కు చెందిన ఒక మహిళ తన భర్త, అత్తమామలు రూ. 2 లక్షల కట్నం ఇవ్వాలంటూ తనను లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. అయితే, 2011లో కమల్ అహ్మద్తో పెళ్లి జరిగిన వెంటనే తనపై వేధింపులు ప్రారంభమయ్యాయని మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
Read Also: Akkineni Akhil : ఎయిర్ పోర్టులో కొత్త జంట..
Also Read
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
అయితే, తన అత్తమామలు అస్మా ఖాటూన్, జునైద్ ఆలంలు రూ.2 లక్షల కట్నం తీసుకు రావాలని తనపై ఒత్తిడి చేసి.. అనేకసార్లు కొట్టడంతో పాటు చివరికి ఇంటి నుంచి గెంటేశారని చెప్పుకొచ్చింది. ఇక, తన తండ్రి ఏదో విధంగా లక్ష రూపాయలు ఇచ్చారు.. అయినా కూడా ఆ వేధింపులు ఆగలేదని తెలిపింది. అలాగే, తన మరిది బెలాల్ అహ్మద్ సైతం అనేకసార్లు లైంగికంగా వేధించాడు.. అతడికి అనుకూలంగా ఉండాలంటూ అత్తమామలు కూడా ఒత్తిడి తీసుకొచ్చారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించింది. మరోవైపు, 2019లో తన భర్త ఫిర్దౌస్ అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు.. ఆ తర్వాత తనను చంపేస్తానని బెదిరించాడని కంప్లైంట్ లో పేర్కొనింది. అలాగే, తన ఇద్దరు పిల్లలను కూడా నా నుంచి మా అత్తమామలు లాక్కున్నారు.. వారిని నాకు అప్పగించాలని కోరింది.
Read Also: Trump: ఆ రెండు దేశాలు పోట్లాడుకోవడం ఇష్టం లేదు
ఇక, ఈ సంఘటనపై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాలతో ఆ వివాహిత వరకట్న వేధింపులు, దాడి, హత్య బెదిరింపుల అభియోగాలతో కేసు నమోదు చేసింది. స్టేషన్ ఇన్చార్జ్ శివంగి త్రిపాఠి మాట్లాడుతూ.. ఈ విషయం చాలా సున్నితమైనది.. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.. విచారణ తర్వాత తగిన ఆధారాలతో నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
BCCI: కోచ్గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
-
Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
-
TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..