Uranium In Water: ఛత్తీస్గఢ్ 6 జిల్లాల్లో నీటిలో ప్రమాదకర స్థాయిలో ‘‘యురేనియం’’
- ఛత్తీస్గఢ్ జిల్లాల్లో భూగర్భ జలాల్లో యురేనియం..
- ఆరు జిల్లాల్లో అధిక పరిమితిలో యురేనియం ఉన్నట్లు వెల్లడి..
- క్యాన్సర్లు.. లంగ్స్.. చర్మ వ్యాధులకు కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uranium In Water: ఛత్తీస్గఢ్లోని 6 జిల్లాల్లోని నీటిలో ప్రమాదకరమైన స్థాయిలో ‘‘యురేనియం’’ ఉందని తేలింది. అణు కార్యక్రమాల్లో ఉపయోగించి యూరేనియం మోతాదుకి మించి నీటిలో ఉండటం ప్రమాదాన్ని సూచిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఒక లీటర్నీటిలో 15 మైక్రోగ్రాముల పరిమిత, ప్రభుత్వం ప్రకారం లీటర్ నీటిలో 30 మైక్రోగ్రాములతో పోలిస్తే ఈ నీటిలో యురేనియా మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా ఉంది. నీటిలో ఈ స్థాయిలో యురేనియం ఉండటం ప్రజల్లో క్యాన్సర్లు, ఊపిరితిత్తుల రోగాలు, చర్మ, మూత్రపిండాల వ్యాధులకు కారణం అవుతుంది.
ఛత్తీస్గఢ్లోని దుర్గ్, రాజ్నంద్గావ్, కంకేర్, బెమెతర, బలోడ్, కవార్ధా ప్రాంతాలలోని తాగు నీటి నమూనాల పరీక్షలలో లీటరుకు 100 మైక్రోగ్రాముల కంటే ఎక్కువ యురేనియం స్థాయిలు కనుగొనబడ్డాయి. 2017లో డబ్ల్యూహెచ్ఓ లీటర్ నీటిలో 15 మైక్రోగ్రాముల పరిమితికి మించకూడదని సూచించింది. డబ్ల్యూహెచ్ఓ భారత్ లాంటి కొన్ని దేశాల్లో ఈ పరిమితిని రెట్టింపు చేసింది. జూన్లో భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం లీటరుకు 60 మైక్రోగ్రాములు కూడా సురక్షితమని సూచించింది.
Also Read
- Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
- PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
- Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
Read Also: Eatala Rajendar: హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
అయితే, ఛత్తీస్గఢ్లోని ఆరు జిల్లాల్లో ఇది 100 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువగా ఉంది. బలోడ్లోని ఒక గ్రామంలోని నీటిని పరీక్షిస్తే ఇది 130 మైక్రోగ్రాములు ఉంది. కాంకేర్ జిల్లాలో లీటర్కి 106 మైక్రోగ్రాముల యురేనియం ఉంది. ఆరు జిల్లాల్లో సగటున లీటర్ నీటికి 86 నుంచి 105 మైక్రోగ్రాముల యురేనియం ఉంది.
భారతదేశంలో పలు రాష్ట్రాల్లోని భూగర్భ జలాల్లో యురేనియం అనేది ఆందోళన కలిగించే విషయం. గత ఏడాది జనవరిలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఇచ్చిన నివేదిక పంజాబ్ మరియు హర్యానాతో సహా 12 రాష్ట్రాల్లో అనుమతించదగిన పరిమితులను దాటిందని పేర్కొంది. ఇందులో రెండు రాష్ట్రాలు భారతదేశంలో సగానికి పైగా గోధుమను పండించేవి ఉన్నాయి. ఆగస్టు 2022లో, బీహార్లోని తొమ్మిది జిల్లాలు నీటిలో యురేనియం అధిక స్థాయిలో ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. 100 శాతం గ్రేడ్ యురేనియం నాలుగు నిక్షేపాలకు చత్తీస్గఢ్ కేంద్రంగా ఉంది. వీటిలో మూడు రాజ్నంద్గావ్ జిల్లాలోనే ఉన్నాయి. ఇక్కడ తాగునీటిలో యురేనియం ఉన్నట్లు తేలింది.
తాజావార్తలు
-
Shubhman Gill: మైదానంలో విలవిలలాడిన గిల్.. నెట్స్లో ఊహించని ప్రమాదం.. అభిమానుల్లో పెరిగిన ఆందోళన..
-
The Paradise Teaser: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
-
UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
-
Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!