Lithium Reserves: దేశంలో తొలిసారిగా జమ్మూకాశ్మీర్లో బయటపడిన లిథియం నిల్వలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lithium Reserves: దేశంలో తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ లో లిథియం నిల్వలను కనుక్కున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. 5.9 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నట్లు వెల్లడించింది. లిథియం నాన్-ఫెర్రస్ మెటర్. సెల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో లిథియంను విరివిగా ఉపయోగిస్తారు. జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో ఈ నిల్వలు ఉన్నట్లు గనుల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.
Read Also: Vande Bharat trains: నేడు మరో రెండు వందేభారత్ ట్రైన్స్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
లిథియంతో పాటు బంగారానికి సంబంధించి 51 మినరల్ బ్లాకులను ఆయా రాష్ట్రప్రభుత్వాలకు అప్పగించింది. ఇందులో 5 బ్లాక్ లు బంగారానికి సంబంధించినవి కాగా.. పొటాష్, మాలిబ్డినం, బేస్ మెటల్స్ మొదలైన ఖనిజాల బ్లాకులు ఉన్నాయి. ఇవి జమ్మూ కాశ్మీర్ తో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ మొత్తం 11 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే ఆధారంగా 2018-19 ఫీల్డ్ సీజన్ నుంచి ఈ బ్లాకులను ఏర్పాటు చేసింది
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వ్యూహాత్మక, కీలకమైన ఖనిజాలపై 115 ప్రాజెక్టులు, ఎరువుల ఖనిజాలపై 16 ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది. 2023-24 ఏడాదిలో 12 సముద్ర ఖనిజ పరిశోధన ప్రాజెక్టులతో సహా 318 ఖనిజ అన్వేషణ ప్రాజెక్టులతో కూడిన 966 కార్యక్రమాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపడుతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. జియోఇన్ఫర్మేటిక్స్పై 55 ప్రోగ్రామ్లు, ఫండమెంటల్ అండ్ మల్టీడిసిప్లినరీ జియోసైన్స్లపై 140 ప్రోగ్రామ్లను, శిక్షణ మరియు సంస్థాగత సామర్థ్యం పెంపు కోసం 155 ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. రైల్వేలకు బొగ్గు నిక్షేపాలను వెలికి తీయాలని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ)ని 1851లో స్థాపించారు. తర్వాతి కాలంలో భౌగోళిక శాస్త్రం, ఖనిజాల పరిశోదన, భూకంపాలు ఇలా పలు రంగాలపై అధ్యయనం చేస్తోంది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..