Lithium Reserves: దేశంలో తొలిసారిగా జమ్మూకాశ్మీర్లో బయటపడిన లిథియం నిల్వలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lithium Reserves: దేశంలో తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ లో లిథియం నిల్వలను కనుక్కున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. 5.9 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నట్లు వెల్లడించింది. లిథియం నాన్-ఫెర్రస్ మెటర్. సెల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో లిథియంను విరివిగా ఉపయోగిస్తారు. జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో ఈ నిల్వలు ఉన్నట్లు గనుల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.
Read Also: Vande Bharat trains: నేడు మరో రెండు వందేభారత్ ట్రైన్స్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Also Read
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
లిథియంతో పాటు బంగారానికి సంబంధించి 51 మినరల్ బ్లాకులను ఆయా రాష్ట్రప్రభుత్వాలకు అప్పగించింది. ఇందులో 5 బ్లాక్ లు బంగారానికి సంబంధించినవి కాగా.. పొటాష్, మాలిబ్డినం, బేస్ మెటల్స్ మొదలైన ఖనిజాల బ్లాకులు ఉన్నాయి. ఇవి జమ్మూ కాశ్మీర్ తో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ మొత్తం 11 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే ఆధారంగా 2018-19 ఫీల్డ్ సీజన్ నుంచి ఈ బ్లాకులను ఏర్పాటు చేసింది
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వ్యూహాత్మక, కీలకమైన ఖనిజాలపై 115 ప్రాజెక్టులు, ఎరువుల ఖనిజాలపై 16 ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది. 2023-24 ఏడాదిలో 12 సముద్ర ఖనిజ పరిశోధన ప్రాజెక్టులతో సహా 318 ఖనిజ అన్వేషణ ప్రాజెక్టులతో కూడిన 966 కార్యక్రమాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపడుతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. జియోఇన్ఫర్మేటిక్స్పై 55 ప్రోగ్రామ్లు, ఫండమెంటల్ అండ్ మల్టీడిసిప్లినరీ జియోసైన్స్లపై 140 ప్రోగ్రామ్లను, శిక్షణ మరియు సంస్థాగత సామర్థ్యం పెంపు కోసం 155 ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. రైల్వేలకు బొగ్గు నిక్షేపాలను వెలికి తీయాలని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ)ని 1851లో స్థాపించారు. తర్వాతి కాలంలో భౌగోళిక శాస్త్రం, ఖనిజాల పరిశోదన, భూకంపాలు ఇలా పలు రంగాలపై అధ్యయనం చేస్తోంది.
తాజావార్తలు
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్వైడ్గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
-
Dean Elgar Retirement: క్రికెట్కు గుడ్బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్.. విరాట్ కోహ్లీతో వివాదం గుర్తుందా?
ట్రెండింగ్
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!