Delhi Liquor Policy Case: మరిన్ని చిక్కుల్లో ఆప్.. ఈడీ ఛార్జిషీట్లో తొలిసారి రాజకీయ పార్టీ పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Liquor Policy Case: దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ రాజకీయ పార్టీ పేరును దర్యాప్తు సంస్థ ఛార్జిషీటులో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని నిందితుడిగా పేర్కొంది. శుక్రవారం రోస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్లో ఆప్ పేరును ప్రస్తావించింది. లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. మార్చి నెలలో ఆయను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్కి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 2న లొంగిపోవాలని చెప్పింది.
Read Also: Jaishankar: ‘‘పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.’’ .. పాకిస్తాన్కి జైశంకర్ వార్నింగ్..
Also Read
ఈ కుంభకోణంలో తాజాగా దాఖలైన ఛార్జిషీట్ 8వది కాగా, ఢిల్లీ సీఎం పేరు ఉన్న మొదటి ఛార్జిషీట్. ఈ కేసులో మరో ఇద్దరు ఆప్ నేతలు మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్పై కూడా అభియోగాలు ఉన్నాయి. అయితే ఆప్ని నిందితుడి పేర్కొనడం పార్టీకి పెను పరిణామాలు కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఈడీ ఎన్నికల సంఘానికి లేఖ రాసే అవకాశం ఉంది. అదే జరిగితే ఆప్ గుర్తింపు రద్దు కావచ్చు. ఈ పార్టీ గుర్తింపును రద్దు చేసే ప్రక్రియ ప్రారంభించాల్సిందిగా ఈడీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరే అవకాశం ఉంది.
మరోవైపు రాజ్యసభ ఎంపీ, ఆప్ నేత స్వాతి మలివాల్పై కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ దాడి చేయడం ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిభవ్ కుమార్ తనను 7 సార్లు చెంపపై కొట్టారని, అంతే కాకుండా కడుపు, ఇతర సున్నిత భాగాలపై కాలితో తన్నినట్లు ఆమె ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ వ్యవహారంపై ఈ రోజు ఢిల్లీ పోలీసులు, ఫోరెన్సిక్ టీం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది. సీన్ క్రియేషన్ కోసం స్వాతి మలివాల్ని అక్కడకు తీసుకెళ్లారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!