Loksabaha Elections 2024: ఓటు వేయని 3 గ్రామాల ప్రజలు.. కారణమేంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఐదవ దశ లోక్సభ ఎన్నికలు కాసేపటి క్రితమే ముగిశాయి. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ కొనసాగింది. అయితే.. ఉత్తర ప్రదేశ్ లోని రెండు గ్రామాలు, జార్ఖండ్లో ఒక గ్రామ ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. దీనికి కారణమేంటని ఆరా తీయగా.. తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేదని.. అందుకే తాము ఓటు వేయడం లేదని తెలుపుతున్నారు. తమ గ్రామ అభివృద్ధి గురించి పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలోని హిసంపూర్ మర్హోలో వేలాది మంది ఓటర్లు ఇంటికే పరిమితమయ్యారు. అంతకుముందు.. గ్రామంలో కూడల్ల వద్ద గ్రామస్తులు ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటిస్తూ పోస్టర్లు వెలిశాయి. తమ ‘‘గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు లేదు.. ఎక్కడికైనా వెళ్లాలంటే రైలు పట్టాలు దాటాలి.. పిల్లలు స్కూల్కి వెళ్లాలంటే పట్టాలు దాటాల్సిందే.. దాదాపు డజను మందిని రైళ్ల కింద పడి చనిపోయారని.. ఈ క్రమంలో ఓవర్బ్రిడ్జి నిర్మిస్తామని ఇచ్చిన హామీలు నెరవేరలేదు” అని గ్రామస్తులు అంటున్నారు.
Also Read
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
Jani Master: రేవ్ పార్టీలో జానీ మాస్టర్.. అసలు విషయం చెప్పేశాడు!
మరోవైపు.. ఓటింగ్ ప్రారంభమైన కొన్ని గంటల తర్వాత గ్రామంలోని ఎవరూ పోలింగ్ బూత్ వద్దకు రాకపోవడంతో సబ్డివిజనల్ మేజిస్ట్రేట్ మహేంద్ర శ్రీవాస్తవ , ఇతర అధికారులు కలిసి గ్రామస్తులను ఓటు వేయమని అభ్యర్థించారు. అయినప్పటికీ గ్రామాస్తులు.. అభివృద్ధి జరిగే వరకు ఓటు వేసేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు.. పరాహాజీ గ్రామ ప్రజలు కూడా ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. వారి సమస్య కూడా వంతెన కోసమే.
అటు.. జార్ఖండ్లోని కుసుంభ గ్రామంలోని 2 వేల మందికి పైగా ఓటర్లు ఓటు వేయలేదు. ఈ క్రమంలో.. డిప్యూటీ కమిషనర్ నాన్సీ సహాయ్ మాట్లాడుతూ, “కుసుంభలోని రెండు పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. నేను, ఎస్పీ అరవింద్ కుమార్తో కలిసి ఓటు వేయమని గ్రామానికి వెళ్ళాము.” బ్రిడ్జి కావాలన్న తమ డిమాండ్ నెరవేరితే ఓటేస్తామని గ్రామస్తులు చెప్పినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. హజారీబాగ్లో ప్లాంట్ ఉన్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ను గ్రామస్తులు వంతెన కోసం కోరినట్లు అధికారులు వివరించారు. అయితే అండర్పాస్ను నిర్మించాలని ఎన్టీపీసీ నిర్ణయించింది. అయితే దీనివల్ల తాగునీరు, నిత్యావసర సరుకులు, వైద్య సేవలకు ఇబ్బందిగా మారుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయమై గత రెండు నెలలుగా ఎన్టీపీసీతో మాట్లాడుతున్నామని జిల్లా యంత్రాంగం తెలిపింది.
తాజావార్తలు
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
ట్రెండింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!