IMD Rain Aalert: దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నానికి భానుడు భగభగమండిపోతున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇలాంటి తరుణంలో భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
దేశ వ్యాప్తంగా వాతావరణం మారిందని.. దీంతో పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవగా.. గురువారం కూడా దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు బలమైన గాలులు, ఉరుములు, మెరుపులు ఉంటాయని ఐఎండీ హెచ్చరించింది. ధూళి తుఫానులు కూడా ఏర్పడతాయని.. దీంతో జనజీవనానికి అంతరాయం కలుగుతుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో ప్రజలు ఉపశమనం పొందుతారని పేర్కొంది.
Also Read
- RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
- Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
- Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
- Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
ఇక దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు ధూళి తుఫానులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే హర్యానా, పంజాబ్లో కూడా బలమైన గాలులతో పాటు ఆకస్మిక ధూళి తుఫానులు ఏర్పడే అవకాశం ఉందని.. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇక పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. బలమైన గాలుల వల్ల చెట్లు కూలిపోయి.. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చని వార్నింగ్ ఇచ్చింది. లోతట్టు ప్రాంతాలు వరదలకు గురికావచ్చని తెలిపింది.
రాబోయే కొద్ది రోజుల పాటు ఈశాన్య భారతదేశంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి దక్షిణ భారతదేశంలో కూడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని.. చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని.. అనవసర ప్రయాణాలను మానుకోవాలని వాతావరణ శాఖ ప్రజలకు సూచించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!