Madhya Pradesh High Court: ఇద్దరు మహిళలు కలిసి జీవించాలనుకుంటే.. కలిసి ఉండొచ్చు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
If two women want to live together they can says Madhya Pradesh High Court: మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. ఇద్దరు మహిళలు కలిసి ఉంటున్న కేసుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు మహిళలు తమ ఇష్టానుసారం కలిసి జీవించాలనుకుంటే.. వారిని కోర్టు అడ్డుకోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. తన కూతురును తనకు అప్పగించాలని కోరుతూ.. 18 ఏళ్ల యువతి తండ్రి దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ను మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం విచారించింది. 18 ఏళ్ల అమ్మాయి, 22 ఏళ్ల యువతితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. ఈ ఘటన రాష్ట్రంలోని జబల్ పూర్ లో జరిగింది.
Read Also: Uttar Pradesh: యూపీలో దారుణం.. మహిళపై భర్త, మరిది అత్యాచారం.. ట్రిపుల్ తలాక్తో మోసం
Also Read
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
పారిపోయిన ఇద్దరు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. కలిసి చదువుకున్నారు. కాలక్రమేణా వీరిద్దరి మధ్య మానసికంగా సంబంధం ఏర్పడింది. ఇద్దరు విడిచి ఉండలేమని నిర్ణయించుకుని ఇళ్ల నుంచి పారిపోయారు. ఇద్దరి మధ్య సంబంధం కుటుంబ సభ్యులకు తెలియడంతో వీరిద్దరు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తమ కుమార్తెను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ 18 ఏళ్ల బాలిక తండ్రి గత నెలలో హైకోర్టులో పిటిషన్ వేశారు.
తన కుమార్తెను సదరు యువతితో ఉండకుండా కుటుంబంతో కలిసి ఉండేలా ఒప్పించేందుకు ప్రయత్నించానని.. అయితే అందుకు ఆమె అంగీకరించలేదని తండ్రి కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు తమ ఎదుట హాజరుకావాలని ఇద్దరమ్మాయిలకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత సదరు అమ్మాయి నిర్ణయం తీసుకునేందుకు కోర్టు గంటపాటు ఆలోచించుకునే సమయం ఇచ్చింది. అయితే ఆమె, తన స్నేహితురాలితోనే ఉంటానని నిర్ణయించుకుంది. అమ్మాయి పెద్దది..జీవితంలో తనకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!