Madhya Pradesh High Court: ఇద్దరు మహిళలు కలిసి జీవించాలనుకుంటే.. కలిసి ఉండొచ్చు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
If two women want to live together they can says Madhya Pradesh High Court: మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. ఇద్దరు మహిళలు కలిసి ఉంటున్న కేసుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు మహిళలు తమ ఇష్టానుసారం కలిసి జీవించాలనుకుంటే.. వారిని కోర్టు అడ్డుకోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. తన కూతురును తనకు అప్పగించాలని కోరుతూ.. 18 ఏళ్ల యువతి తండ్రి దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ను మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం విచారించింది. 18 ఏళ్ల అమ్మాయి, 22 ఏళ్ల యువతితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. ఈ ఘటన రాష్ట్రంలోని జబల్ పూర్ లో జరిగింది.
Read Also: Uttar Pradesh: యూపీలో దారుణం.. మహిళపై భర్త, మరిది అత్యాచారం.. ట్రిపుల్ తలాక్తో మోసం
Also Read
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
- Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
పారిపోయిన ఇద్దరు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. కలిసి చదువుకున్నారు. కాలక్రమేణా వీరిద్దరి మధ్య మానసికంగా సంబంధం ఏర్పడింది. ఇద్దరు విడిచి ఉండలేమని నిర్ణయించుకుని ఇళ్ల నుంచి పారిపోయారు. ఇద్దరి మధ్య సంబంధం కుటుంబ సభ్యులకు తెలియడంతో వీరిద్దరు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తమ కుమార్తెను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ 18 ఏళ్ల బాలిక తండ్రి గత నెలలో హైకోర్టులో పిటిషన్ వేశారు.
తన కుమార్తెను సదరు యువతితో ఉండకుండా కుటుంబంతో కలిసి ఉండేలా ఒప్పించేందుకు ప్రయత్నించానని.. అయితే అందుకు ఆమె అంగీకరించలేదని తండ్రి కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు తమ ఎదుట హాజరుకావాలని ఇద్దరమ్మాయిలకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత సదరు అమ్మాయి నిర్ణయం తీసుకునేందుకు కోర్టు గంటపాటు ఆలోచించుకునే సమయం ఇచ్చింది. అయితే ఆమె, తన స్నేహితురాలితోనే ఉంటానని నిర్ణయించుకుంది. అమ్మాయి పెద్దది..జీవితంలో తనకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
-
OTR : నిజామాబాద్ గులాబీ కోటలో గందరగోళం.. నేతల తీరు చర్చనీయాంశం!
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
-
AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్పై ఎన్టీఆర్ ఫోకస్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!