Pakistan: ‘‘భారత్ మాపై దాడి చేస్తే, ప్రపంచం అంతం’’.. పాక్ రక్షణ మంత్రి వార్నింగ్..
- ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ రక్షణమంత్రి బెదిరింపులు..
- భారత్ పాక్పై దాడి చేస్తే ప్రపంచం అంతం అవుతుందని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వణికిపోతోంది. భారత్ ప్రతీకారంగా ఎప్పుడు తమపై విరుచుకుపడుతుందో తెలియక దాయాది ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ ఆందోళన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వంలోని కీలక నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికి కూడా అర్థం కావడం లేదు. ప్రభుత్వంలో మంత్రులు భారత్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, భారత్ దాడి చేస్తే అణ్వాయుధాలతో దాడి చేస్తామని చెబుతున్నారు.
Read Also: Off The Record: మాజీ మంత్రి అనిత్ కుమార్ యాదవ్ వంతు వచ్చిందా..?
Also Read
- Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
తాజాగా, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరింత ముందుకెళ్లి విచిత్రమైన వాదన చేశారు. ‘‘భారత్ పాకిస్తాన్పై దాడి చేయడానికి ధైర్యం చేస్తే, పాకిస్తాన్ ఉనికికి ముప్పు వాటిల్లితే ఈ ప్రపంచంలో ఎవరూ మనుగడ సాధించలేరు’’ అంటూ మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కి ఏదైనా జరిగే మొత్తం ప్రపంచమే అంతం అవుతుందని, మేం బతికి ఉండాలి లేదంటే ఎవరూ బతకకూడదు అంటూ కామెంట్స్ చేశారు.
దీనికి ముందు, జమ్మూ కాశ్మీర్ వెంబడి నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి భారత్ ఎప్పుడైనా సైనిక దాడి చేయవచ్చని ఖ్వాజా ఆసిఫ్ హెచ్చరించారు. భారత్ దాడికి పాక్ ధీటైన సమాధానం ఇస్తుందని విలేకరుల సమావేశంలో అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కోరారు అని అన్నారు. భారత్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తమపై అనవసర, నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని ఆసిఫ్ చెప్పారు. వీటిలో పాటు సింధు జలాలపై భారత్ ఏ ప్రాజెక్టును, ఏ నిర్మాణాన్ని చేపట్టిన పాకిస్తాన్ వాటిని ధ్వంసం చేస్తుందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
-
Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
-
Billa Ranga Baasha: సుదీప్ మూవీకి భారీ ప్లాన్.. ‘బిల్లా రంగ బాషా’ ప్రమోషనల్ క్యాలెండర్ అవుట్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!