Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. సాధారణంగా తన విధ్వంసకర బ్యాటింగ్తో అభిమానులను ఆకట్టుకునే ఈ యువ ఆటగాడు.. ఈసారి బంతితో అదరగొట్టాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ, నార్త్ ఈస్ట్ జోన్తో జరిగిన మ్యాచ్లో కీలక సమయంలో రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
ఇన్నింగ్స్ 210 పరుగుల భారీ తేడాతో ఈస్ట్ జోన్ విజయం
దులీప్ ట్రోఫీలో ఇషాన్ కిషన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఈస్ట్ జోన్ అద్భుత విజయాన్ని అందుకుంది. నార్త్ ఈస్ట్ జోన్ను ఒక ఇన్నింగ్స్, 210 పరుగుల భారీ తేడాతో ఓడించి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ ఏకంగా 467 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ భారీ స్కోరును అందుకోలేక నార్త్ ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆ జట్టు ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది. రెండో ఇన్నింగ్స్లోనూ నార్త్ ఈస్ట్ జోన్ తడబడటంతో ఈస్ట్ జోన్ భారీ విజయాన్ని నమోదు చేసింది.
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
బ్యాటింగ్లో విఫలం.. బౌలింగ్లో అదుర్స్
వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో బ్యాటింగ్తో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న అతను కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. అయితే బంతితో మాత్రం తన సత్తా చాటాడు. నార్త్ ఈస్ట్ జోన్ బ్యాటర్లు వికెట్లు కోల్పోకుండా ఆడుతున్న సమయంలో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ బంతిని వైభవ్ సూర్యవంశీకి అప్పగించాడు. యువ స్పిన్నర్కు బంతిని ఇవ్వడం కొంత రిస్క్ అని ఇషాన్ భావించినప్పటికీ.. వైభవ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
కేవలం 3 ఓవర్లు.. 11 పరుగులు.. 2 కీలక వికెట్లు
బంతి అందుకున్న వైభవ్ సూర్యవంశీ కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఈ మూడు ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 75/5తో ఉన్న సమయంలో వైభవ్ వరుసగా దెబ్బకొట్టాడు. తొలుత కిషన్ లింగ్డోను అవుట్ చేసిన అతను.. ఆ తర్వాత ఇమ్లివాటి లెమ్టూర్ను వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చేలా చేశాడు. దీంతో నార్త్ ఈస్ట్ జోన్ స్కోరు 75/5 నుంచి 79/7కు పడిపోయింది.
‘నేను వికెట్లు తీస్తానని ఇషాన్ భయ్యాకు తెలియదు’
మ్యాచ్ అనంతరం బీసీసీఐ డొమెస్టిక్ షేర్ చేసిన వీడియోలో వైభవ్ తన బౌలింగ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇషాన్ కిషన్ తనకు బంతిని ఇచ్చిన సమయంలో తాను వికెట్లు తీయగలననే విషయం అతనికి తెలియదని సరదాగా చెప్పాడు. ప్రత్యర్థి జట్టు వికెట్లు కోల్పోకుండా ఆడుతున్నందున తనకు రెండు లేదా మూడు ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చారని వైభవ్ తెలిపాడు. తనకు బంతిని ఇవ్వడం రిస్క్ అని ఇషాన్ భావించాడని, అయితే తాను వికెట్లు తీయగల బౌలర్ననే విషయం తన కెప్టెన్కు తెలియదని చెప్పాడు.
లైన్ అండ్ లెంగ్త్పైనే పూర్తి దృష్టి
తనకు ఎక్కువ ఓవర్లు లభించవని ముందే తెలుసని వైభవ్ చెప్పాడు. ఐదు వికెట్లు తీసినా మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం ఉంటుందని భావించి, ప్రతి బంతిని సరైన లైన్ అండ్ లెంగ్త్లో వేయడంపైనే దృష్టి పెట్టినట్లు వెల్లడించాడు. గత మ్యాచ్లో బ్యాటింగ్లో పెద్దగా రాణించలేకపోయానని, ఈ మ్యాచ్లో బౌలింగ్తో జట్టుకు సహకరించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని వైభవ్ చెప్పాడు.
ఆదివారం సెమీఫైనల్లో వైభవ్పై అందరి చూపు
నార్త్ ఈస్ట్ జోన్పై భారీ విజయంతో ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ సెమీఫైనల్కు చేరుకుంది. ఇప్పుడు బెంగళూరులో ఆదివారం సెంట్రల్ జోన్తో జరిగే సెమీఫైనల్లో వైభవ్ సూర్యవంశీ మరోసారి బరిలోకి దిగనున్నాడు. బ్యాట్తో పాటు బంతితోనూ తన సత్తా చాటుతున్న ఈ 15 ఏళ్ల యువ సంచలనం సెమీఫైనల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!