Sakshi Gupta: ‘లక్కీ భాస్కర్’ మాదిరిగా ప్లాన్.. రూ.4 కోట్లు కొట్టేసి చివరకు..!
- ‘లక్కీ భాస్కర్’ మాదిరిగా ప్లాన్
- రూ.4 కోట్లు కొట్టేసి చివరకు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంత మంది సినిమాల్లో మాదిరిగా.. నిజ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయని ఊహించుకుంటారు. కానీ అంతా అయ్యాకగాని తత్వం బోధపడదు. ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? ఆ మధ్య టాలీవుడ్లో విడుదలైన ‘లక్కీ భాస్కర్’ సినిమాలో హీరో మాదిరిగా బ్యాంక్ను మోసం చేయాలని ఓ ఉద్యోగి ప్లాన్ చేసింది. కానీ సినిమాల్లో మాదిరిగా నిజజీవితంలో తప్పించుకోవడం సాధ్యం కాదని తెలియక కటకటాల పాలైంది. ఈ సంఘటన రాజస్థాన్లోని కోటాలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Kamal Haasan: రాజ్యసభకు కమల్ హాసన్ నామినేషన్.. హాజరైన సీఎం స్టాలిన్!
Also Read
- Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
- Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
- Modi-Trump: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వేగం.. ఏఐ రంగంలో సహకారానికి రెడీ
- India - Iran Talks: ఇరాన్ నుంచి చమురు దిగుమతులపై కీలక చర్చలు.. భారత్ తదుపరి అడుగు ఏంటి?
రాజస్థాన్లోని కోటాలో ఐసీఐసీఐ రిలేషన్షిప్ మేనేజర్ సాక్షి గుప్తా 41 మంది కస్టమర్లకు చెందిన ఫిక్సెడ్ డిపాజిట్ అకౌంట్ల నుంచి రూ.4.58 కోట్లను కాజేసింది. 2020 నుంచి 2023 సంవత్సరాల మధ్య 110 ఖాతాల నుంచి రూ.4.58 కోట్లు లాక్కుంది. కస్టమర్లు ఇచ్చిన ఫోన్ నెంబర్లను మార్చి తన కుటుంబ సభ్యుల నెంబర్లను అప్డేట్ చేసింది. దీంతో ఓటీపీలు, మెసేజ్లు కస్టమర్లకు చేరకపోవడంతో ఎలాంటి అనుమానాలు రాలేదు. అయితే కస్టమర్ల నుంచి దొంగిలించిన డబ్బుంతా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. తీరా చూస్తే ఆ డబ్బుంతా పోగొట్టుకుంది. తీసుకున్న డబ్బును మాత్రం ఆమె తిరిగి డిపాజిట్ చేయలేకపోయింది. కస్టమర్లు డిపాజిట్లు చెక్ చేసుకోగా డబ్బులు లేకపోవడం లబోదిబో అన్నారు. దీంతో బండారం బయటపడి పోలీసులకు చేరింది. అయితే సినిమాలో హీరో తప్పించుకున్నట్టుగా సాధ్యం కాకపోవడంతో మేనేజర్ సాక్షి గుప్తా అండగా బుక్కైంది.
ఇది కూడా చదవండి: PM Modi: ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన మోడీ
ఒక కస్టమర్ ఆరా తీయడంతో ఈ యవ్వారం బయటపడింది. ఫిబ్రవరి 18న పోలీసులకు ఫిర్యాదు అందగా అప్పటినుంచి తప్పించుకుని తిరుగుతోంది. గురువారం సోదరి వివాహం జరుగుతుండగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న సాక్షి గుప్తాను అరెస్ట్ చేశారు. కస్టమర్ల నష్టాన్ని భర్తీ చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. బ్యాంకుల్లో కూడా క్షేమం కాకపోతే.. ఇంకెక్కడ దాచుకోవాలని కస్టమర్లు వాపోతున్నారు.
తాజావార్తలు
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!