Sakshi Gupta: ‘లక్కీ భాస్కర్’ మాదిరిగా ప్లాన్.. రూ.4 కోట్లు కొట్టేసి చివరకు..!
- ‘లక్కీ భాస్కర్’ మాదిరిగా ప్లాన్
- రూ.4 కోట్లు కొట్టేసి చివరకు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంత మంది సినిమాల్లో మాదిరిగా.. నిజ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయని ఊహించుకుంటారు. కానీ అంతా అయ్యాకగాని తత్వం బోధపడదు. ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? ఆ మధ్య టాలీవుడ్లో విడుదలైన ‘లక్కీ భాస్కర్’ సినిమాలో హీరో మాదిరిగా బ్యాంక్ను మోసం చేయాలని ఓ ఉద్యోగి ప్లాన్ చేసింది. కానీ సినిమాల్లో మాదిరిగా నిజజీవితంలో తప్పించుకోవడం సాధ్యం కాదని తెలియక కటకటాల పాలైంది. ఈ సంఘటన రాజస్థాన్లోని కోటాలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Kamal Haasan: రాజ్యసభకు కమల్ హాసన్ నామినేషన్.. హాజరైన సీఎం స్టాలిన్!
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
రాజస్థాన్లోని కోటాలో ఐసీఐసీఐ రిలేషన్షిప్ మేనేజర్ సాక్షి గుప్తా 41 మంది కస్టమర్లకు చెందిన ఫిక్సెడ్ డిపాజిట్ అకౌంట్ల నుంచి రూ.4.58 కోట్లను కాజేసింది. 2020 నుంచి 2023 సంవత్సరాల మధ్య 110 ఖాతాల నుంచి రూ.4.58 కోట్లు లాక్కుంది. కస్టమర్లు ఇచ్చిన ఫోన్ నెంబర్లను మార్చి తన కుటుంబ సభ్యుల నెంబర్లను అప్డేట్ చేసింది. దీంతో ఓటీపీలు, మెసేజ్లు కస్టమర్లకు చేరకపోవడంతో ఎలాంటి అనుమానాలు రాలేదు. అయితే కస్టమర్ల నుంచి దొంగిలించిన డబ్బుంతా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. తీరా చూస్తే ఆ డబ్బుంతా పోగొట్టుకుంది. తీసుకున్న డబ్బును మాత్రం ఆమె తిరిగి డిపాజిట్ చేయలేకపోయింది. కస్టమర్లు డిపాజిట్లు చెక్ చేసుకోగా డబ్బులు లేకపోవడం లబోదిబో అన్నారు. దీంతో బండారం బయటపడి పోలీసులకు చేరింది. అయితే సినిమాలో హీరో తప్పించుకున్నట్టుగా సాధ్యం కాకపోవడంతో మేనేజర్ సాక్షి గుప్తా అండగా బుక్కైంది.
ఇది కూడా చదవండి: PM Modi: ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన మోడీ
ఒక కస్టమర్ ఆరా తీయడంతో ఈ యవ్వారం బయటపడింది. ఫిబ్రవరి 18న పోలీసులకు ఫిర్యాదు అందగా అప్పటినుంచి తప్పించుకుని తిరుగుతోంది. గురువారం సోదరి వివాహం జరుగుతుండగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న సాక్షి గుప్తాను అరెస్ట్ చేశారు. కస్టమర్ల నష్టాన్ని భర్తీ చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. బ్యాంకుల్లో కూడా క్షేమం కాకపోతే.. ఇంకెక్కడ దాచుకోవాలని కస్టమర్లు వాపోతున్నారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!