IAS Wedding: బ్యాండ్ లేదు.. తంతు లేదు.. సచివాలయంలో దండలతో ఒక్కటైన ఐఏఎస్ జంట
- సచివాలయంలో దండలతో ఒక్కటైన ఐఏఎస్ జంట
- కలెక్టర్ సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్
- సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిన పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం కాలంలో పెళ్లిళ్లు ఏం రేంజ్లో జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. గొప్పలకు పోయి కోట్లు కుమ్మరిస్తున్నారు. ఇక సామాన్యులైతే కనీసనం లక్షల్లోనైనా చాలా గ్రాండ్గా జరిపిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న ట్రెండ్. అలాంటిది దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న ఇద్దరు బ్యూరోక్రాట్లు చాలా సింపుల్గా.. ఎలాంటి హంగామా లేకుండా.. ఎలాంటి బ్యాండ్ మేళా లేకుండా.. అలంకరణ.. డీజేలు లేకుండా కేవలం దండలు మార్చుకుని తంతు ముగించేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.
మాధవ్ భరద్వాజ్-అదితి వాష్ణ్యే ఇద్దరూ కూడా 2023 బ్యాచ్కు చెందిన యువ ఐఏఎస్లు. ఐఏఎస్ శిక్షణ సమయంలో స్నేహం కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి వారి మధ్య బంధం కొనసాగుతోంది. అయితే ఇరు కుటుంబాల అంగీకారం కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా రెండు కుటుంబాలు పెళ్లికి గ్రీన్సిగ్నల్స్ ఇచ్చేశాయి. దీంతో ఎగిరి గంతేసిన జంట.. పెళ్లి మాత్రం చాలా సింపుల్గా ముగించేశారు.
Also Read
- Peer Ali Khan: పుస్తకాల మధ్య పుట్టిన తిరుగుబాటు.. ఉరికంబం ముందు తలవంచని పీర్ అలీ ఖాన్!
- NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
- PM SVANidhi Scheme: కేంద్రం గుడ్న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
- Nepal Violence: భారత సరిహద్దులో ఐఎస్ఐ కుట్ర? నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు..
రాజస్థాన్లోని అల్వార్ మినీ సచివాలయంలో కలెక్టర్ అర్పితా శుక్లా సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరూ దండలు మార్చుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జీవితాంతం ఒకరికొకరు కలిసి ఉంటామని ప్రమాణం చేయడంతో చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేశారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు, కొద్ది మంది బంధుమిత్రులే హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Bengaluru: భర్త పక్కన నిద్రిస్తున్న వివాహితను చంపి రూ.65 లక్షల నగలు చోరీ.. ఇందులో ట్విస్ట్ ఏంటంటే..!
మాధవ్ భరద్వాజ్ ప్రస్తుతం అల్వార్లో SDM గా పనిచేస్తున్నారు. భార్య అదితి వాష్ణ్యే ప్రస్తుతం గుజరాత్లోని జామ్నగర్లో SDM గా ఉన్నారు. అదితి ఉత్తరప్రదేశ్లోని బరేలీ వాసి. వ్యాపార కుటుంబం నుంచి వచ్చింది. కేవలం దండలు మార్చుకుని ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: PM Modi: డిజైన్.. అభివృద్ధి మా నినాదం.. ఏఐ దేశానికి గొప్ప అవకాశం అన్న మోడీ
తాజావార్తలు
-
శ్రావణంలో నాన్వెజ్ మిస్ అవుతున్నారా?.. చికెన్, మటన్కు మించిన టేస్ట్.. Soya Chunks Dry ట్రై చేయండి!
-
Psychology facts: అర్థరాత్రి.. నిద్రపోని మనసు.. సముద్రంలో అలల్లా ఎగసిపడుతున్న ఆలోచనలకు కారణం ఇదే!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Peer Ali Khan: పుస్తకాల మధ్య పుట్టిన తిరుగుబాటు.. ఉరికంబం ముందు తలవంచని పీర్ అలీ ఖాన్!
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
ట్రెండింగ్
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!