Indian Air Force: గంగా ఎక్స్ప్రెస్ వేపై యుద్ధ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్.. ఉద్రిక్తల వేళ ఐఏఎఫ్ సత్తా..
- భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ సత్తా చాటిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్..
- గంగా ఎక్స్ప్రెస్వే రన్ వే ప్రారంభానికి అంతా సిద్ధం..
- హైవేపై యుద్ధవిమానాల విన్యాసాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Air Force: భారతదేశంలో మరో రోడ్ ‘రన్ వే’ని ఈ రోజు ప్రారంభించనున్నారు. భారత వైమానిక దళం ఉత్తర్ ప్రదేశ్ షాజహాన్పూర్ జిల్లాలోని గంగా ఎక్స్ప్రెస్వే పై నిర్మించిన 3.5 కి.మీ పొడవైన ఎయిర్ స్ట్రిప్ని శుక్రవారం ప్రారంభించనుంది. ఇది దేశ రక్షణను మరింత పెంచుతుంది. అధునాతన లైటింగ్, నావిగేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్ స్ట్రిప్పై యుద్ధ విమానాలు పగలు, రాత్రి ల్యాండింగ్ చేయవచ్చు. భారత్లో ఇలాంటి సదుపాయం ఉన్న ఎయిర్స్ట్రిప్లో ఇదే మొదటిది.
మీరట్-ప్రయాగ్ రాజ్లను కలిపే 594 కి.మీ పొడవైన గంగా హైవేపై జలాలాబాద్లో ఈ ఎయిర్ స్ట్రిప్ ఉంది. ఈ ఎయిర్ స్ట్రిప్ పనులు దాదాపుగా 85 శాతం పూర్తయ్యాయి. ఇప్పటికే, యూపీలోని ఆగ్రా-లక్నో, పూర్వాంచల్, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వేలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ దిగేందుకు అనువుగా రన్వేలు రూపొందించారు. గంగా ఎక్స్ప్రెస్వే రన్ వే నాలుగోది.
Also Read
- PM SVANidhi Scheme: కేంద్రం గుడ్న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
- Nepal Violence: భారత సరిహద్దులో ఐఎస్ఐ కుట్ర? నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు..
- RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
- Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
Read Also: Minister Nara Lokesh: వంద పాకిస్థాన్లకు సమాధానం చెప్పే మిస్సైల్ మనదగ్గర ఉంది..అందేంటో తెలుసా?
షాజహాన్పూర్ ఎయిర్స్ట్రిప్లో IAF రెండు దశల్లో ఫైటర్ జెట్ విన్యాసాలు నిర్వహిస్తుంది.ఈ విన్యాసాలలో రాఫెల్, సుఖోయ్-30 MKI, మిరాజ్-2000, MiG-29, జాగ్వార్, C-130J సూపర్ హెర్క్యులస్, AN-32 రవాణా విమానం మరియు MI-17 V5 హెలికాప్టర్లు వంటి విమానాలు ఉంటాయి. యుద్ధం లేదా ఇతర జాతీయ అత్యవసర పరిస్థితుత్లో ఈ రన్వే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఐఏఎఫ్ విన్యాసాలు నిర్వహిస్తోంది. విజిబులిటీ తక్కుగా ఉన్న రాత్రి సమయాల్లో సురక్షిత ల్యాండింగ్, టేకాఫ్ నిర్ధారించేందుకు ప్రెసిషన్ అప్రోచ్ లైటింగ్, రీన్ఫోర్స్డ్ పేవ్మెంట్ స్ట్రెంగ్త్, CAT II ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ILS) సాంకేతికతను కలిగి ఉంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో గంగా ఎక్స్ప్రెస్ రన్వే ప్రారంభించడం గమనార్హం. ఈ కార్యక్రమం కోసం యూపీ సర్కార్ విస్తృతఏర్పాటు చేసింది. దాదాపుగా 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. గురువారం నుంచే ఈ మార్గాన్ని ఎయిర్ఫోర్స్ తన నియంత్రణలోకి తీసుకుంది.
తాజావార్తలు
-
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
-
2026 Tollywood Box Office : ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలు!
-
Moon Mission Explained: చంద్రునిపై ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం..ఈ మహా పోరులో భారత్ వైపు అమెరికా?
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!