Amarinder Singh: బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేసిన కెప్టెన్.. కాంగ్రెస్లో చేరే ప్రసక్తి లేదు..
- బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్..
- బీజేపీలో నిర్ణయాలు ఢిల్లీ నుంచే తీసుకుంటారు, నన్ను అస్సలు సంప్రదించరు..
- కాంగ్రెస్లో చేరే ప్రసక్తి లేదు.. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో చీలిపోతుంది: అమరీందర్ సింగ్
Amarinder Singh: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ తన సొంత పార్టీ పనితీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీలో కీలక నిర్ణయాలన్నీ ఢిల్లీలోనే తీసుకుంటారని, తనలాంటి రాజకీయ అనుభవం ఉన్నవారి అభిప్రాయాలను కూడా అడగడం లేదన్నారు. అయితే, కాంగ్రెస్లోకి తిరిగి వెళ్లే ప్రశ్నే లేదని కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్లో ఉన్న సమయంలో తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన తీరు ఇప్పటికీ తనకు బాధను కలిగిస్తోందని పేర్కొన్నారు. అయినప్పటికీ సోనియా గాంధీ వ్యక్తిగతంగా సహాయం కోరితే చేస్తానని, రాజకీయంగా మాత్రం కాదు అని కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు.
Read Also: Akhanda 2 : బాలయ్య కెరీర్ హయ్యెస్ట్.. రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్
Also Read
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
- Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
- Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..
- West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
ఇక, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంగా ఉండేదని, హైకమాండ్ను కలవడం సులభమని బీజేపీ నేత అమరీందర్ సింగ్ చెప్పారు. బీజేపీలో మాత్రం పైస్థాయి నేతలను కలవడం కష్టం.. నిర్ణయాలు క్షేత్రస్థాయి నేతలతో చర్చించకుండా తీసుకుంటారని విమర్శించారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపిస్తూ, ఆయనకు పంజాబ్పై ప్రత్యేక అభిమానం ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సిద్ధంగా ఉన్నారు.. పంజాబ్లో స్థిరత్వం రావాలంటే బీజేపీ- అకాళీదళ్ కూటమి తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తన రాజకీయ అనుభవం ప్రకారం ఈ రెండు పార్టీలు మళ్లీ కలుస్తాయని అమరీందర్ సింగ్ చెప్పారు.
Read Also: The Raja Saab : నెల రోజుల ముందే.. ‘ది రాజా సాబ్’ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ!
అయితే, నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజకీయాలు మానేసి క్రికెట్ కామెంట్రీపై దృష్టి పెట్టడం మంచిదని బీజేపీ నేత అమరీందర్ సింంగ్ ఎద్దేవా చేశారు. అలాగే, వచ్చే ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో చీలిపోతుంది.. రెండు అంకెల సీట్లు కూడా దక్కవని అన్నారు. ఇక, పాకిస్థాన్ భారత్లో స్థిరత్వం కోరదు.. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల పాత్ర కీలకం అన్నారు. మొత్తంగా పంజాబ్ భద్రత, అభివృద్ధి కోసం ప్రజలు బీజేపీని గురించి ఆలోచించాలని అమరీందర్ సింగ్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
-
Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
-
Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!