Jammu Kashmir: మరో లష్కరే తోయిబా ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన భద్రతా దళాలు..
- జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా విస్తృతంగా ఉగ్రవేట..
- మరో లష్కరే తోయిబా ఉగ్రవాది ఇళ్లు పేల్చివేత..
- ఇప్పటికే ఆరుగురు ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ని జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదుల కోసం విస్తృతంగా వేట కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా, ఉగ్రవాదులకు సంబంధించి ఇళ్లను భద్రతా బలగాలు ధ్వంసం చేస్తున్నాయి. గత 48 గంటల్లో, భద్రతా బలగాలు, స్థానిక అధికారుల సమన్వయంతో జమ్మూ కాశ్మీర్ అంతటా అనేక మంది ఉగ్రవాదుల ఇళ్లను కూల్చేసి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ చర్యల్ని ముమ్మరం చేశాయి.
తాజా ఆపరేషన్లో, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్కి చెందిన కుప్వారాలో ఉన్న ఇంటిని పేల్చేవారు. పహల్గామ్ దాడి తర్వాత ఇది ఆరో సంఘటన. ఇప్పటి వరకు భద్రతా బలగాలు ఆరుగురు ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేశాయి. ఫరూఖ్ ఇంటితో పాటు, ఇతర ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ఆస్తుల్ని కూడా లక్ష్యంగా చేసుకున్నారు.
Also Read
- Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
- UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
Read Also: Calcutta High Court: వక్షోజాలను టచ్ చేయడం ‘‘అత్యాచారం కాదు’’, కానీ..
ఇప్పటి వరకు అనంత్నాగ్ జిత్లాలోని థోకర్పూరాలోని ఆదిల్ అహ్మద్ థోకర్, పుల్వామలోని ముర్రాన్కి చెందిన అహ్సాన్ ఉల్ హక్ షేక్, త్రాల్లో ఆసిఫ్ అహ్మద్ షేక్, షోఫియాన్లోని చోటి పురాకు చెందిన షాహిద్ అహ్మద్ కుట్టాయ్, కుల్గామ్లో మతల్హామాకు చెందిన అహ్మద్ గనీ ఇళ్లను కూల్చేశారు. శుక్రవారం, పహల్గామ్ దాడిలో పాల్గొన్నట్లు భావిస్తున్న ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా దళాలు కూల్చివేశాయి. బిజ్బెహారాలో లష్కర్ ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ థోకర్ నివాసాన్ని IEDలను ఉపయోగించి పేల్చివేయగా, ట్రాల్లోని ఆసిఫ్ షేక్ ఇంటిని బుల్డోజర్తో కూల్చివేశారు.
మంగళవారం, పహల్గామ్ బైసరన్ లోయలో అందాలను చూసేందుకు వచ్చిన టూరిస్టుల్ని, ముఖ్యంగా హిందూ మతానికి చెందిన వారిని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది మరణించారు. ఈ దాడికి ప్లాన్ చేయడంలో పాక్ ఉగ్రవాదులకు ఆదిల్ థోకర్ సాయం చేశాడని అధికారులు అనుమానిస్తున్నారు. 2018లో పంజాబ్లోని అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా థోకర్ పాకిస్తాన్లోకి ప్రవేశించి, అక్కడ ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ పొందాడు. తరువాత అతను గత సంవత్సరం జమ్మూ కాశ్మీర్లోకి తిరిగి చొరబడ్డాడు.
తాజావార్తలు
-
Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
-
UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
-
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..?
-
F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..