Hoax bomb threat: విమానాల్లో స్కై మార్షల్స్ సంఖ్య పెంపు.. నకిలీ బాంబు బెదిరింపులపై కీలక నిర్ణయం..!
- మూడు రోజుల్లో 12 విమానాలకు బాంబు బెదిరింపులు..
- సీరియస్గా విచారిస్తున్న కేంద్ర ఏజెన్సీలు..
- విమానాల్లో స్కై మార్షల్స్ సంఖ్య పెంపు..?
- బెదిరింపులకు పాల్పడే వారు ‘‘నో ఫ్లై’’ జాబితాలోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hoax bomb threat: గత మూడు రోజులుగా భారతీయ విమానసంస్థలు నకిలీ బాంబు బెదిరింపుల్ని ఎదుర్కొంటున్నాయి. సోమవారం నుంచి ఈ రోజు బుధవారం వరకు మొత్తం 12 విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఈ రోజు ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి, ఢిల్లీ నుంచి బెంగళూర్ వెళ్తున్న ఆకాస విమానానికి బాంబు ఉందంటూ బెదిరింపు సందేశాలు వచ్చాయి. మంగళవారం ఢిల్లీ-చికాగో ఎయిరిండియా విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. దీంతో విమానాన్ని కెనడాలోని ఓ మారుమూల విమానాశ్రయంలో ల్యాండ్ చేసి, తనిఖీలు నిర్వహించాల్సి వచ్చింది.
Read Also: Canadian Sikh MP: భారత్పై ఆంక్షలు, ఆర్ఎస్ఎస్పై బ్యాన్.. కెనడియన్ సిక్కు ఎంపీ కామెడీ..
Also Read
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
ఈ నేపథ్యంలో ఈ రోజు కేంద్ర పౌరవిమానయాన అధికారులు అత్యున్న సమావేశం నిర్వహించారు. మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, హోం మంత్రిత్వ శాఖ అధికారులు భేటీలో పాల్గొన్నారు. సమాచారం ప్రకారం.. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఈ బూటకపు కాలర్లను గుర్తించి వీరిని ‘నో ఫ్లై’ జాబితాలో చేర్చేందుకు సమాయత్తమవుతోంది. ఇదే విధంగా విమానాల్లో ఎయిర్ మార్షల్స్ సంఖ్యను రెట్టింపు చేయడంపై కూడా చర్చ జరుగుతోంది. ఎన్ఎస్జీ కమాండో యూనిట్ ఎయిర్ మార్షల్స్ని ప్రధానంగా అంతర్జాతీయ మార్గాలు, దేశీయంగా సున్నితమైన మార్గాల్లో మోహరించనున్నారు. స్కై మార్షల్స్ సాధారణ ప్రయాణికుల వలే విమానంలో ప్రయాణించే సాయుధ భద్రతా అధికారులు.
బాంబు బెదిరింపులపై నివేదిక సమర్పించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి)లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు తెలుస్తోంది. భారతదేశ విమానరంగానికి చెడ్డపేరు తెచ్చేందుకు కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
-
Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
-
CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
-
Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!