Hoax bomb threat: విమానాల్లో స్కై మార్షల్స్ సంఖ్య పెంపు.. నకిలీ బాంబు బెదిరింపులపై కీలక నిర్ణయం..!
- మూడు రోజుల్లో 12 విమానాలకు బాంబు బెదిరింపులు..
- సీరియస్గా విచారిస్తున్న కేంద్ర ఏజెన్సీలు..
- విమానాల్లో స్కై మార్షల్స్ సంఖ్య పెంపు..?
- బెదిరింపులకు పాల్పడే వారు ‘‘నో ఫ్లై’’ జాబితాలోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hoax bomb threat: గత మూడు రోజులుగా భారతీయ విమానసంస్థలు నకిలీ బాంబు బెదిరింపుల్ని ఎదుర్కొంటున్నాయి. సోమవారం నుంచి ఈ రోజు బుధవారం వరకు మొత్తం 12 విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఈ రోజు ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి, ఢిల్లీ నుంచి బెంగళూర్ వెళ్తున్న ఆకాస విమానానికి బాంబు ఉందంటూ బెదిరింపు సందేశాలు వచ్చాయి. మంగళవారం ఢిల్లీ-చికాగో ఎయిరిండియా విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. దీంతో విమానాన్ని కెనడాలోని ఓ మారుమూల విమానాశ్రయంలో ల్యాండ్ చేసి, తనిఖీలు నిర్వహించాల్సి వచ్చింది.
Read Also: Canadian Sikh MP: భారత్పై ఆంక్షలు, ఆర్ఎస్ఎస్పై బ్యాన్.. కెనడియన్ సిక్కు ఎంపీ కామెడీ..
Also Read
ఈ నేపథ్యంలో ఈ రోజు కేంద్ర పౌరవిమానయాన అధికారులు అత్యున్న సమావేశం నిర్వహించారు. మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, హోం మంత్రిత్వ శాఖ అధికారులు భేటీలో పాల్గొన్నారు. సమాచారం ప్రకారం.. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఈ బూటకపు కాలర్లను గుర్తించి వీరిని ‘నో ఫ్లై’ జాబితాలో చేర్చేందుకు సమాయత్తమవుతోంది. ఇదే విధంగా విమానాల్లో ఎయిర్ మార్షల్స్ సంఖ్యను రెట్టింపు చేయడంపై కూడా చర్చ జరుగుతోంది. ఎన్ఎస్జీ కమాండో యూనిట్ ఎయిర్ మార్షల్స్ని ప్రధానంగా అంతర్జాతీయ మార్గాలు, దేశీయంగా సున్నితమైన మార్గాల్లో మోహరించనున్నారు. స్కై మార్షల్స్ సాధారణ ప్రయాణికుల వలే విమానంలో ప్రయాణించే సాయుధ భద్రతా అధికారులు.
బాంబు బెదిరింపులపై నివేదిక సమర్పించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి)లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు తెలుస్తోంది. భారతదేశ విమానరంగానికి చెడ్డపేరు తెచ్చేందుకు కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?