Himanta Biswa Sarma: ‘‘చైనా బ్రహ్మపుత్ర నీటిని ఆపేస్తే ఎలా..?’’ అస్సాం సీఎం అదిరిపోయే సమాధానం..
- బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపేస్తే ఎలా..?
- అస్సాం సీఎం అదిరిపోయే సమాధానం..
- వాస్తవ పరిస్థితుల్ని చెప్పిన హిమంత బిశ్వసర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: చైనా భారతదేశానికి బ్రహ్మపుత్ర నీటిని ఆపేస్తే పరిస్థితి ఏమిటి..? అనే దానిపై అస్సా సీఎం హిమంత బిశ్వ సర్మ స్పందించారు. దీనిపై ఎక్స్లో ఒక పోస్ట్లో ‘‘భయంతో కాదు, వాస్తవాలు, నేషనల్ క్లారిటీతో ఈ అపోహను తొలగిస్తాం’’ అని అన్నారు. బ్రహ్మపుత్ర భారత్కి చేరిన తర్వాత పెరిగే నది అని, కుచించుకుపోయే నది కాదని ఆయన తెలిపారు.
Read Also: Pakistan Spy: పంజాబ్లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. ఖలిస్తాన్ ఉగ్రవాదితో సంబంధాలు..
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
సీఎం హిమంత ప్రకారం, చైనా నుంచి వచ్చే బ్రహ్మపుత్ర ప్రవాహం 30-35 శాతం మాత్రమే ఉంటుందని, ఇది ప్రధానంగా హిమనీనదాలు కరగడం, పరిమిత వర్షపాతం నుంచే వస్తుందని నుంచి వస్తుంది. మిగతా 65-70 శాతం నది ప్రవాహం భారత్లో ప్రవహించే దాని ఉపనదులు, రుతపవన వర్షపాతం నుంచే వస్తుంది. బ్రహ్మపుత్ర ప్రవాహ డేటాను పరిశీలిస్తే.. ఇండో-చైనా సరిహద్దు వద్ద నది ప్రవాహం సగటున సెకనుకు 2,000 మరియు 3,000 క్యూబిక్ మీటర్ల ఉంటే, వర్షాకాలంలో అస్సాంలో ఇది 15,000-20,000 క్యూబిక్ మీటర్లకు పెరుగుతుంది. ఇది నది ప్రవాహంలో భారతదేశ ఆధిపత్యానికి నిదర్శనమని హిమంత బిశ్వ సర్మ చెప్పారు.
“బ్రహ్మపుత్ర నది భారతదేశం అప్స్ట్రీమ్పై ఆధారపడి ఉంటుంది. ఇది వర్షాధార భారతీయ నదీ వ్యవస్థ, భారత భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత బలోపేతం అవుతుంది” అని ఆయన అన్నారు. బ్రహ్మపుత్ర నదిని ఆయుధంగా మారుస్తామని చైనా ఎప్పుడూ అధికారికంగా బెదిరించలేదని, ఆ సూచనను ఊహాజనిత భయాందోళన కలిగించేదిగా తోసిపుచ్చారు. ఒక వేళ చైనా బ్రహ్మపుత్ర నీటిని అడ్డుకుంటే, ఇది అస్సాంలో వరదల్ని తగ్గిస్తుందని చెప్పారు. “బ్రహ్మపుత్ర ఒకే సోర్స్ ద్వారా నియంత్రించబడదు. ఇది మన భౌగోళికం, మన రుతుపవనాలు, మన నాగరికత స్థితిస్థాపకత ద్వారా శక్తిని పొందుతుంది” అని ఆయన ముగించారు. సింధు జలాల ఒప్పందం నిలిపేయడంతో పాకిస్తాన్ ఇప్పుడు భయాందోళనకు గురవుతోందని అన్నారు.
What If China Stops Brahmaputra Water to India?
A Response to Pakistan’s New Scare NarrativeAfter India decisively moved away from the outdated Indus Waters Treaty, Pakistan is now spinning another manufactured threat:
“What if China stops the Brahmaputra’s water to India?”…— Himanta Biswa Sarma (@himantabiswa) June 2, 2025
తాజావార్తలు
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!