Independence Day Celebrations 2022: ఎర్రకోటపై స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Independence Day Celebrations 2022: ఎర్రకోటపై స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఎగరవేసే దిల్లీలోని ఎర్రకోట పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు శనివారం దిల్లీ పోలీసులు వెల్లడించారు. ఎర్రకోట ప్రాంగణ ప్రవేశద్వారం వద్ద ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వేడుకకు 7 వేల మంది వీక్షకులు రానుండగా, 10 వేల మంది పోలీసులతో బహుళ అంచెల్లో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట నుంచి 5 కిలోమీటర్ల మేర నో ఫ్లయింగ్ జోన్ను ఏర్పాటు చేశారు. పతంగులు, డ్రోన్లు, చైనీస్ లాంతర్ల ఎగురవేతపై నిషేధం విధించారు. పారాగ్లైడర్లు, హాంగ్ గ్లైడర్లు, ఎయిర్ బెలూన్లు తదితరాల సంచారంపై జులై 22న విధించిన నిషేధాజ్ఞలు ఆగస్టు 16 వరకు అమలులో ఉంటాయని తెలిపారు. ఎర్రకోటపై యాంటీ డ్రోనో రాడార్ను ఏర్పాటు చేశారు. 10 వేల మంది సాయుధ బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.
Imran Khan: మరోసారి ఇండియాపై ప్రశంసలు.. జై శంకర్ వీడియోను చూపిస్తూ పొగిడిన ఇమ్రాన్ ఖాన్
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
డీఆర్డీవో, ఇతర రక్షణ విభాగాలు రూపొందించిన యాంటీ డ్రోన్, రాడార్ వ్యవస్థలను సిద్ధంగా ఉంచారు. సున్నిత ప్రాంతాల్లో 400 మంది కైట్ క్యాచర్స్ను నియమించారు. అత్యంత నాణ్యత గల సీసీ కెమెరాల ద్వారా అనుక్షణం పర్యవేక్షించనున్నట్లు ఢిల్లీ ప్రత్యేక కమిషనర్ దీపేందర్ పాఠక్ తెలిపారు. మరోపక్క, దిల్లీలోని ఆనంద్విహార్ ప్రాంతంలో శుక్రవారం పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి 2వేలకుపైగా తూటాలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. విధ్వంసక చర్యలను అరికట్టేందుకు పోలీసులు దేశ రాజధాని వ్యాప్తంగా గస్తీ ముమ్మరం చేశారు. ఢిల్లీలో ఇప్పటికే 144 సెక్షన్ను అమలులోకి తెచ్చినట్టు దేవేంద్ర పాఠక్ తెలిపారు. ఇటు నిఘా విభాగం హెచ్చరికలతో పోలీసులు పెట్రోలింగ్, తనిఖీలను ముమ్మరం చేశారు. హోటళ్లు, గెస్ట్హౌస్లు, పార్కింగ్ స్థలాలు, రెస్టారెంట్లు తనిఖీలు చేస్తునాుమని, అద్దెదారుల, సేవకుల వెరిఫికేషన్ను నిర్వహిస్తున్నామని అధికారులు చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!